తెలంగాణ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ రిజ‌ల్ట్స్ రిలీజ్

VijayaBhaskar · June 11, 2026
Spread the love

ప్ర‌క‌టించిన ఇంటర్మీడియ‌ట్ బోర్డు

హైద‌రాబాద్ : తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు (టీఐబీ) గురువారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు ఇటీవ‌ల రాష్ట్రంలో నిర్వహించిన ఇంట‌ర్మీడియ‌ట్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌కు సంబంధించి ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించింది. ఉత్తీర్ణత శాతం మొదటి సంవత్సరంలో 68.84% ఉండ‌గా రెండవ సంవత్సరంలో 49.29%గా నమోదైన‌ట్లు తెలిపింది బోర్డు. మరోసారి బాలుర కంటే బాలికలే మెరుగైన ఫలితాలు సాధించారని స్ప‌ష్టం చేసింది. .

ఇదిలా ఉండ‌గా బాలికల ఉత్తీర్ణత శాతం మొదటి సంవత్సరంలో 76.10 శాతంగా, రెండవ సంవత్సరంలో 52.56 శాతంగా ఉంది. దీనికి భిన్నంగా, బాలురు మొదటి సంవత్సరంలో 62.57 శాతం , రెండవ సంవత్సరంలో 47.45 శాతం ఉత్తీర్ణతను నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,98,459 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. మ‌రో వైపు ఈ ప‌రీక్ష‌ల్లో కూడా ఫెయిల్ అయిన వారికి మ‌రో ఛాన్స్ లేకుండా పోయింది. ఒక‌వేళ ఇంట‌ర్ ఫ‌ష్ట్ ఇయ‌ర్ లో గ‌నుక త‌ప్పి పోతే రెండో సంవ‌త్స‌రం ప‌రీక్ష‌లతో పాటు ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది.