వైద్య సేవ నిపుణుల వసతి సౌకర్యాలపై ఆరా

Spread the love

సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని జేఈవో ఆదేశం

తిరుపతి : శ్రీవారి భక్తులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రానున్న శ్రీవారి వైద్య సేవ నిపుణుల కోసం కేటాయించిన అతిథి గృహాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో కలిసి వసతి కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ నెల 17వ తేదీన తొలి విడత వైద్య నిపుణులు రానున్న నేపథ్యంలో వశిష్ఠ అతిథి గృహం, ఆయుర్వేద కళాశాల అతిథి గృహం, స్విమ్స్ అతిథి గృహాల్లో అవసరమైన అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

వైద్యులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా భక్తులకు సేవలందించే విధంగా వసతి గృహాల్లో పరిశుభ్రత, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం తదితర మౌలిక వసతులను సమృద్ధిగా కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఎస్‌ఈలు మనోహరం, వేంకటేశ్వర్లు, ముఖ్య వైద్యాధికారి డాక్టర్ కుసుమ కుమారి, ఎస్వీ గోశాల డైరెక్టర్ డా. ఏవీఎన్ శివకుమార్, బర్డ్ సూపరింటెండెంట్ వెంకట రెడ్డి, టీటీడీ , స్విమ్స్ అధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    శ్రీవారి సేవలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

    Spread the love

    Spread the loveసాద‌ర స్వాగ‌తం ప‌లికిన టీటీడీ ఈవో ర‌విచంద్ర‌ తిరుమల : ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ శుక్రవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ఆమెకు టీటీడీ ఈవో…

    టీటీడీ అన్న‌ప్ర‌సాదానికి రూ. 2,500 కోట్లు

    Spread the love

    Spread the loveఫిక్స్ డ్ డిపాజిట్లు ఉన్నాయ‌న్న టీటీడీ తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) ఆధ్వ‌ర్యంలో నిత్యం అన్నదానం కొన‌సాగుతోంది. ప్ర‌తి రోజూ స్వామి వారిని 75 వేల నుంచి 80 వేల మందికి పైగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *