ఏపీ సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
విదేశాంగ మంత్రి బాలకృష్ణన్ తో సీఎం భేటీ
సింగపూర్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ సందర్బంగా ఆయన సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ తో భేటీ అయ్యారు. ఈ ఇద్దరూ చాలా సేపు వివిధ అంశాలపై చర్చించారు. ఆత్మీయంగా, ఫలవంతంగా చర్చలు జరిగాయని తెలిపారు ఈ సందర్బంగా సీఎం . గత సమావేశాలను ఆప్యాయంగా గుర్తు చేసుకోవడం జరిగిందని అన్నారు చర్చల అనంతరం చంద్రబాబు నాయుడు. తామిద్దరి మధ్య జరిగిన సంభాషణ సింగపూర్ , ఆంధ్రప్రదేశ్ మధ్య విమాన సేవలు, రాబోయే విమానాశ్రయాలు , మెరుగైన విమాన కనెక్టివిటీతో సహా కనెక్టివిటీ , ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించిందని చెప్పారు.
డిజిటల్ మౌలిక సదుపాయాలు, సముద్రగర్భ ఇంటర్నెట్ కనెక్టివిటీ, డేటా సెంటర్ ఆధారిత ఎకోసిస్టమ్ అభివృద్ధి, వాణిజ్య అంతరిక్ష రంగంలోని వర్ధమాన రంగాలలో ఉన్న అవకాశాల గురించి కూడా చర్చించామన్నారు. దాని వ్యూహాత్మక ప్రయోజనాలను ఉపయోగించుకుని, ఆవిష్కరణలు, కనెక్టివిటీ, ప్రపంచ భాగస్వామ్యాల ద్వారా భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను నిర్మించాలనే ఆంధ్రప్రదేశ్ దార్శనికతను తాను తనతో పంచు కోవడం జరిగిందన్నారు సీఎం.