సూక్ష్మసేద్యం అమలులో ఏపీ నెంబ‌ర్ వ‌న్

Spread the love

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన వ్య‌వ‌సాయ శాఖ మంత్రి

అమ‌రావ‌తి : సూక్ష్మసేద్యం అమలులో ఏపీ నెంబ‌ర్ వ‌న్ అని పేర్కొన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 5.5 లక్షల ఎకరాలను కొత్తగా సూక్ష్మసేద్య పరిధిలోకి తీసుకువచ్చామని మంత్రి పేర్కొన్నారు. రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి, గిట్టుబాటు ధరలు, నష్టపరిహారం, విద్యుత్, సాగునీరు, మార్కెటింగ్ సదుపాయాలు వంటి అన్ని అంశాల్లో ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అసత్య ప్రచారాలను నమ్మకుండా రైతులు వాస్తవాలను గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఖరీఫ్ సాగుకు అవసరమైన ఎరువుల కొరత లేదని, రైతులకు సకాలంలో ఎరువులు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు.

జూన్ 8వ తేదీ నుండి జూన్ 16వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 95,506 మంది రైతులకు మొత్తం 4,77,501 ఎరువుల బస్తాలు విక్రయించినట్లు మంత్రి వెల్లడించారు. ఇందులో 3,56,916 యూరియా బస్తాలు, 1,20,585 డీఏపీ బస్తాలు రైతులకు అందించామని తెలిపారు. గ‌త వైసీపీ ప్ర‌భుత్వంలో ఎరువులను అక్ర‌మంగా అమ్ముకున్నారు, ఎరువులను రైతులకు అంద‌చేసేందుకు ప్ర‌త్యేక‌ యాప్ ను తీసుకొచ్చాం, రాష్ట్ర వ్యాప్తంగా స‌క్ర‌మంగా ఎరువుల‌ కొనుగోలు జ‌రుగున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు.

  • Related Posts

    ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్

    Spread the love

    Spread the loveఒప్పందాన్ని ఉల్లంఘిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు అమెరికా : ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఇరాన్‌పై కొత్తగా సైనిక చర్యలు తప్పవని ట్రంప్ తీవ్ర స్థాయిలో హెచ్చ‌రించారు. ఇరాన్‌తో ఘర్షణకు ముగింపు పలికే ఉద్దేశంతో శాంతి ఒప్పందం కుదుర్చుకోనున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు…

    సైబ‌ర్ నేర‌స్తుల‌ను ఉపేక్షించొద్దు : సుప్రీంకోర్టు

    Spread the love

    Spread the loveఈ నేర‌గాళ్లు ప‌రాన్న‌జీవులని షాకింగ్ కామెంట్స్ న్యూఢిల్లీ : దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. సైబర్ మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఒక నిందితుడిపై నమోదైన వివిధ ఎఫ్‌ఐఆర్‌లను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *