నీటి విద్యార్థి కుటుంబాలను ఆదుకోవాలి
కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే
ఢిల్లీ : కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత దేశంలో చోటు చేసుకున్న ప్రధాన పరీక్షలైన నీట్ యుజి 2026 తో పాటు సీబీఎస్ఈ పరీక్షలు లీక్ కావడం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఇందుకు ప్రధాన బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అభిజిత్ దిపాకే ఈ రోజు అందరి హృదయాలను గెలుచుకున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న ప్రస్తుత సంక్షోభంపై ఆయన ధైర్యవంతమైన ప్రకటన చేశారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనుగోలు చేయడానికి కోట్లాది రూపాయలు ఉన్నాయి. కానీ నీట్ (NEET) వ్యవహారంలో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు మాత్రం డబ్బు లేదు ఎందుకని ప్రశ్నించారు అభిజిత్ దీప్కే. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. తమకు ఎవరితోనూ వ్యక్తిగత శత్రుత్వం లేదన్నారు. నీట్ యుజి ఎగ్జామ్ లీకేజీ కారణంగా నష్ట పోయిన విద్యార్థులు పలువురు ప్రాణాలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బాధిత కుటుంబాలను ఆదుకోవాలిన డిమాండ్ చేశారు.