వెల్లడించిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
ముంబై : జూన్లో UPI లావాదేవీలు రికార్డు స్థాయి నుండి రూ. 28.9 లక్షల కోట్లకు తగ్గాయి. కాగా గత మే నెలలో UPI లావాదేవీలు రూ. 29.9 లక్షల కోట్ల రికార్డు స్థాయిని తాకాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, జూన్లో ప్రముఖ ‘యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్’ (UPI) ద్వారా జరిగిన లావాదేవీల విలువ రికార్డు స్థాయి నుండి రూ. 28.9 లక్షల కోట్లకు తగ్గింది. బుధవారం విడుదలైన డేటా ప్రకారం, జూన్లో నమోదైన UPI లావాదేవీల సంఖ్య (వాల్యూమ్) 22.72 బిలియన్లుగా ఉంది; ఇది అంతకు ముందు నెలలో నమోదైన 23.2 బిలియన్ల కంటే తక్కువ. జూన్లో లావాదేవీల విలువ రూ. 28.9 లక్షల కోట్లుగా ఉండగా, ఏడాది క్రితం ఇదే నెలలో ఇది రూ. 24.03 లక్షల కోట్లుగా ఉంది, అంటే వార్షిక ప్రాతిపదికన 20 శాతం వృద్ధి నమోదైంది. జూన్ 2025లో UPI లావాదేవీల సంఖ్య 18.3 బిలియన్లుగా నమోదైంది.
“జూన్లో UPI లావాదేవీల సంఖ్య నెలవారీగా తగ్గినప్పటికీ, ఆ నెలలో రోజువారీ సగటు 757 మిలియన్ల లావాదేవీలు నమోదు కావడం UPI ప్రారంభమైనప్పటి నుండి అత్యధికం. తక్కువ విలువ కలిగిన లావాదేవీలకు UPI ఎలా ప్రధాన చెల్లింపు విధానంగా మారిందో ఈ రోజువారీ సగటులు ఆసక్తికరంగా తెలియ జేస్తున్నాయి” అని క్యాష్ఫ్రీ పేమెంట్స్ (Cashfree Payments) సహ వ్యవస్థాపకుడు రీజు దత్తా అన్నారు. స్పైస్ మనీ (Spice Money) CEO దిలీప్ మోదీ ప్రకారం, జూన్ UPI గణాంకాలు కేవలం లావాదేవీల సంఖ్య 22.7 బిలియన్లను దాటడం వల్లే కాకుండా, గత ఏడాది కాలంలో భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ విస్తరించిన వేగాన్ని ప్రతిబింబించడం వల్ల కూడా చాలా ముఖ్యమైనవి. కేవలం 12 నెలల్లో, UPI లావాదేవీల సంఖ్య 4.3 బిలియన్లకు పైగా , విలువ దాదాపు రూ. 5 లక్షల కోట్లకు పెరిగిందని, ఇది దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులపై పెరుగుతున్న నమ్మకాన్ని ,ఆధారపడటాన్ని నొక్కి చెబుతోందని ఆయన అన్నారు.















