హైదరాబాద్ : బీహార్ కు చెందిన వైభవ్ సూర్య వంశీ సంచలనంగా మారాడు. తను అతి పిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన అరుదైన క్రికెటర్ గా రికార్డ్ సృష్టించాడు. భారత్ తరపున అరంగేట్రం చేసిన అత్యంత పిన్న వయస్కులైన పురుష క్రికెటర్ల జాబితాలో తను మరీ చిన్నవాడు కావడం విశేషం.. సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమిస్తూ, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్తో జరిగిన టీ20 అంతర్జాతీయ మ్యాచ్ కోసం జట్టులో ఎంపికై, భారత్ తరపున అరంగేట్రం చేసిన అత్యంత పిన్న వయస్కుడైన పురుష క్రికెటర్గా నిలిచాడు. 2025లో కేవలం 14 ఏళ్ల వయసులో రాజస్థాన్ రాయల్స్ తరపున ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో అరంగేట్రం చేసినప్పటి నుంచే, ఈ యువ ఆటగాడు క్రికెట్లో అత్యంత ఆశాజనకమైన ప్రతిభావంతులలో ఒకరిగా గుర్తింపు పొందాడు.
ఈ ఏడాది ఐపీఎల్లో 16 మ్యాచ్లలో 776 పరుగులు చేసి రాజస్థాన్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవడమే కాకుండా, ఒక సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ రికార్డును కూడా బద్దలు కొట్టి తన ఖ్యాతిని మరింత పెంచుకున్నాడు. ఈ పోటీలో అతను మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ , ‘బెస్ట్ ఎమర్జింగ్ ప్లేయర్’ (ఉత్తమ ఉద్భవిస్తున్న ఆటగాడు)గా ఎంపికయ్యాడు, దీనివల్ల ఐర్లాండ్ , ఇంగ్లాండ్లతో జరిగే టీ20 సిరీస్లకు అతనికి పిలుపు వచ్చింది. అయితే, ఐర్లాండ్తో జరిగిన సిరీస్లో భారత్ 0-2తో ఊహించని ఓటమిని చవిచూడటంతో, సూర్యవంశీకి ఆ సిరీస్లో అరంగేట్రం చేసే అవకాశం దక్కలేదు వైభవ్ సూర్య వంశీకి.















