newsseals.com

క‌స్తూరి రంగ‌న్ నివేదిక‌పై నిర్ణ‌యం తీసుకుంటాం

September 19, 2026 · VijayaBhaskar

బెంగ‌ళూరు : కస్తూరి రంగన్ నివేదిక పరిధిలోకి వచ్చే ప్రాంతాలలో క్షేత్రస్థాయి సర్వే జరపాలన్న డిమాండ్‌పై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్ప‌ష్టం చేశారు. ఉడుపి జిల్లాలోని హెబ్రిలో స్థానికులు, వివిధ సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రానికి తమ నిర్ణయాన్ని తెలియజేసే ముందు ఆ ప్రాంత ప్రజల ఆందోళనలను అర్థం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ , అభివృద్ధి మధ్య సమతుల్యతను సాధించేందుకు, ఆరు రాష్ట్రాల పరిధిలోని సుమారు 60,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన పశ్చిమ కనుమలలో 37 శాతం భాగాన్ని పర్యావరణ సున్నిత ప్రాంతంగా ప్రకటించాలని కస్తూరిరంగన్ కమిటీ సిఫార్సు చేసింది.

తాము సెప్టెంబర్ 27 నాటికి కేంద్రానికి మా నిర్ణయాన్ని పంపాల్సి ఉందన్నారు. మీ అభిప్రాయాలను తెలుసు కోవడానికి మీరు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకోవడానికి తాము ఇక్క‌డికి వ‌చ్చామ‌న్నారు. మీరు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని, కేరళ తరహాలో క్షేత్రస్థాయి సర్వే నిర్వహించాలని సూచించారు. మేము ఈ సూచనలను పరిశీలించి, అసెంబ్లీలో ఈ అంశంపై చర్చిస్తామని ప్ర‌క‌టించారు డీకే శివ‌కుమార్. రైతులు, కరువు పరిస్థితులు , కస్తూరిరంగన్ నివేదికకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను మూడు రోజుల పాటు ఏర్పాటు చేసింద‌న్నారు. సమావేశాల మొదటి రోజున ఈ నివేదికపై చర్చ జరుగుతుందని ఆయన తెలిపారు. శివమొగ్గ , చిక్కమగళూరు ప్రాంతాల్లోని ప్రజల అభిప్రాయాలను తెలుసు కోవడానికి అక్కడికి కూడా వెళ్తానని శివకుమార్ ప్ర‌క‌టించారు.

Related News