హైదరాబాద్ : రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆయన తను ప్రాతినిధ్యం వహిస్తున్న హూజూర్ నగర్ శాసన సభ నియోజకవర్గంలో సర్ ఓట్ల ప్రక్రియపై స్పందించారు. ఈ రోజు వరకు నియోజకవర్గంలో ఎస్ఐఆర్ (SIR) ఓటరు నమోదు డిజిటైజేషన్ కార్యక్రమం పురోగతిపై వచ్చిన నివేదికను పరిశీలించానని అన్నారు. మన నియోజకవర్గం, పట్టణం, మండలం, గ్రామం , బూత్ స్థాయి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, బీఎల్ఏలు (BLAs) అందరికీ నా హృదయ పూర్వక విజ్ఞప్తి ఏమిటంటే, ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని ప్రతి బూత్లో కనీసం 95% ఓటరు నమోదు డిజిటైజేషన్ పూర్తి చేసే లక్ష్యంతో పని చేయాలని కోరారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ఇది కేవలం ఒక లక్ష్యం మాత్రమే కాదు . ప్రతి అర్హత కలిగిన ఓటరు పేరు సక్రమంగా నమోదు కావడం, ఒక్క నిజమైన ఓటరు కూడా మిగిలి పోకుండా చూడడం మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు . తమ తమ బూత్లలో 100% డిజిటైజేషన్ పూర్తి చేసిన కాంగ్రెస్ నాయకులు , బీఎల్ఏలను ఈ నెల 26వ తేదీన హుజూర్నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నా చేతుల మీదుగా ప్రత్యేకంగా సన్మానిస్తానని సంచలన ప్రకటన చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అందరం సమన్వయంతో, అంకితభావంతో పనిచేసి హుజూర్నగర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలబెట్టాలని పిలుపునిచ్చారు.






