జార్ఖండ్ లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు

జార్ఖండ్ : కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో ఈడీ (ED) భారీ సోదాలు చేపట్టింది. ఈ దాడుల‌లో రూ. 1.5 కోట్ల నగదు, రూ. 150 కోట్లకు పైగా విలువైన ఆస్తులు క‌లిగి ఉన్న‌ట్లు గుర్తించింది. ఇటీవ‌లి కాలంలో ఈడీ జ‌రిపిన సోదాల‌లో ఎక్కువ‌గా ల‌భ్య‌మైన ప‌త్రాలు ఇవే కావ‌డం గ‌మ‌నార్హం. అక్రమ బొగ్గు వ్యాపారం, మనీ లాండరింగ్ నెట్‌వర్క్‌కు సంబంధించిన దర్యాప్తులో భాగంగా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో 25కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో భారీ సోదాలు నిర్వహించింది.

ఈ ఆపరేషన్ సమయంలో, ఏజెన్సీ సుమారు ₹1.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు, ₹150 కోట్లకు పైగా విలువైన ఆస్తులు, బ్యాంక్ నిల్వలను గుర్తించింది. అక్రమ బొగ్గు వ్యాపారానికి సంబంధించిన ఆర్థిక అవకతవకల సమాచారం ఆధారంగా ఈ సోదాలు జరిగాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, జార్ఖండ్‌లో ఈడీ ఇప్పటివరకు చేపట్టిన చర్యలలో స్వాధీనం చేసుకున్న వాటిలో ఇది అత్యంత భారీ మొత్తాలలో ఒకటి ఇది . దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని స్ప‌ష్టం చేసింది ఈడీ. సోదాల సమయంలో సేకరించిన ఆర్థిక రికార్డులు , ఇతర ఆధారాలను అధికారులు పరిశీలిస్తున్నారు. దర్యాప్తులో వెల్లడయ్యే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

  • Related Posts

    గిగ్, ప్లాట్ ఫామ్ కార్మికుల కోసం పొదుపు ఖాతా

    హైద‌రాబాద్ : గిగ్ , ప్లాట్‌ఫామ్ కార్మికుల కోసం ఇండియన్ బ్యాంక్ ఇండీ-గిగ్ చాంపియన్ పొదుపు ఖాతాను గురువారం ప్రారంభించింది. తెలంగాణ గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (టిజిపిడబ్ల్యూ యు )తో పైలట్ కార్యక్రమం కింద దీనిని స్టార్ట్ చేసింది. ఇందులో…

    సమీర్ వాంఖడేకు ముంబై హైకోర్టు బిగ్ రిలీఫ్

    ముంబై : NCB విచారణ నుండి సమీర్ వాంఖడేకు ముంబై హైకోర్టు మధ్యంతర ఉపశమనం క‌లిగింది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన కేసుతో సహా రెండు డ్రగ్స్ కేసులలోని అక్రమాలపై ఎన్సీబీ విచారణ చేపట్టింది. రెండు కేసులలోని అక్రమాల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *