న్యూఢిల్లీ : న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయంలో మత పరమైన కార్యక్రమాన్ని నిర్వహంచేందుకు ప్లాన్ చేసింది ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ఇస్కాన్. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలియ చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు. మత పరమైన సంస్థలకు యూనివర్శిటీలో చోటు లేదని ప్రకటించారు. ఈ మేరకు తీవ్ర నిరసన తెలపడంతో ఎట్టకేలకు ఇస్కాన్ దిగి వచ్చింది. తమ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని, రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉండగా విశ్వ విద్యాలయ ప్రాంగణంలో మతపరమైన సంస్థలు ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడానికి వర్సిటీ నిబంధనలు అనుమతించవని జెఎన్ఎస్ యు పేర్కొంది. ఇస్కాన్ ప్రతినిధి పాల్గొనాల్సి ఉన్న ఒక కార్యక్రమానికి వ్యతిరేకంగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ సెంట్రల్ లైబ్రరీ బయట నిరసన తెలిపింది, దీని ఫలితంగా ఆ కార్యక్రమం రద్దయినట్లు విద్యార్థి సంఘం సభ్యులు తెలిపారు.
ఉజ్వల భవిష్యత్తు కోసం యువత సాధికారత’ అనే పేరుతో యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఈ కార్యక్రమం జరగాల్సి ఉంది. ఇందులో ఒక సెషన్ కూడా ఉండేలా ప్రణాళిక చేశారు. క్యాంపస్లో భగవద్గీతపై కార్యక్రమం నిర్వహించడానికి ఇస్కాన్కు అనుమతి ఇవ్వడంపై గత ఏడాది కూడా యూనివర్సిటీ యంత్రాంగం వద్ద అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ప్రధాన కార్యదర్శి సునీల్ యాదవ్ తెలిపారు. నవంబర్ 2025లో, గీతపై కార్యక్రమం నిర్వహించడానికి ఇస్కాన్కు ఇచ్చిన అనుమతిని ఎత్తి చూపుతూ యంత్రాంగానికి లేఖ రాసింది. అదే సంస్థకు చెందిన ప్రతినిధి లైబ్రరీలో ప్రసంగించాల్సి ఉంది అని యాదవ్ చెప్పారు. నిరసన తర్వాత, వారు కార్యక్రమాన్ని రద్దు చేయాల్సి వచ్చింది అని ఆయన జోడించారు. యూనివర్సిటీ చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం, ఇలాంటి కార్యక్రమాలకు ఏ మతపరమైన సంస్థకూ అనుమతి ఇవ్వకూడదు. కానీ, పరిపాలనా యంత్రాంగం అనేక ఇలాంటి కార్యక్రమాలకు అనుమతి ఇచ్చింది అని ఆయన ఆరోపించారు.






