హైదరాబాద్ : విద్యుత్ రంగ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న సరికొత్త సాంకేతికతలు, ఆవిష్కరణలు , పరివర్తనాత్మక కార్యక్రమాలకు సంబంధించి ఉత్సాహ భరితమైన ప్రదర్శన అయిన పవర్ ఎక్స్పో 2026ను అనుభవించడానికి టీజీఎస్పీడీసీఎల్ ఆవిష్కర్తలకు ఆహ్వానం పలుకుతోంది. ఆగస్టు 22, 23, 24వ తేదీలలో మూడు రోజుల పాటు ఈ ఎక్స్ పో కార్యక్రమాన్ని హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో ఉన్న పీపుల్స్ ప్లాజాలో నిర్వహిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , స్మార్ట్ టెక్నాలజీ, SCADA , డేటా అక్విజిషన్ఫ ల్ట్ లొకేషన్, ఐసోలేషన్ , సర్వీస్ రిస్టోరేషన్ , స్మార్ట్ మీటరింగ్ డిజిటల్ మానిటరింగ్ , మెరుగైన భద్రత విశ్వసనీయత, సుస్థిరమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న విద్యుత్ పరిష్కారాలు, ఆధునిక వినియోగదారుల సేవల గురించి ఇందులో ఉంటాయని పేర్కొంది .
విద్యుత్ భవిష్యత్తు , ఆవిష్కరణల పట్ల అభిరుచి ఉన్న విద్యుత్ రంగ ఉద్యోగులు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, ఆవిష్కర్తలు, సాంకేతికత పట్ల ఆసక్తి ఉన్నవారు, విద్యార్థులు , యువతరాన్ని TGSPDCL సాదరంగా ఆహ్వానిస్తోంది. విద్యుత్, సాంకేతికత, ఏఐ, స్మార్ట్ గ్రిడ్లు, డిజిటలైజేషన్ , ఆవిష్కరణల ఉత్తేజకరమైన ప్రపంచాన్ని అన్వేషించడానికి మీ విద్యార్థులను తీసుకు రావాలని, తదుపరి తరం ఇంజనీర్లు, ఆవిష్కర్తలను ప్రేరేపించాలని కోరారు ఈ సందర్బంగా టీజీఎస్పీడీసీఎల్ సంస్థ సీఎండీ జితేష్ పాటిల్. ఇందులో ఆవిష్కర్తల ప్రయోగాలకు సంపూర్ణ మద్దతు కూడా ఇస్తామని పేర్కొన్నారు.






