మ‌హిళా వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌కు భారీ బ‌హుమానం

Spread the love

ప్ర‌క‌టించిన పారిశ్రామిక‌వేత్త గోవింద్ ధోలాకియా

ముంబై : రాజ్య‌స‌భ స‌భ్యుడు, పారిశ్రామిక‌వేత్త గోవింద్ థోలాకియా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. సుదీర్ఘ కాలం త‌ర్వాత 143 కోట్ల భార‌తీయుల క‌ల‌ను నిజం చేసిన భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టును ఆయ‌న ప్ర‌త్యేకంగా అభినందించారు. ఈ సంద‌ర్బంగా భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లాకు లేఖ రాశారు. ముంబై వేదిక‌గా బీవై పాటిల్ స్టేడియంలో జ‌రిగిన కీల‌క‌మైన ఐసీసీ మ‌హిళ‌ల వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ లో బ‌ల‌మైన దక్షిణాఫ్రికాను 5 వికెట్ల తేడాతో ఓడించింది హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ సేన‌. ఈ సంద‌ర్బంగా భార‌త మ‌హిళా జ‌ట్టుకు భారీ నజ‌రానా ప్ర‌క‌టించారు. తమ సంస్థ నుంచి ప్ర‌తి ఒక్క క్రికెట‌ర్ కు వ‌జ్రాల‌తో కూడిన ఆభ‌ర‌ణాలు ఇస్తాన‌ని వెల్ల‌డించారు. ఈ మేర‌కు ఆయ‌న లేఖ రాశారు. ఇందుకు బీసీసీఐ కూడా ఓకే చెప్పింది.

తాజాగా ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న ప‌ట్ల స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తం అవుతోంది. మ‌రో వైపు బీసీసీఐ కూడా ఎవ‌రూ ఊహించ‌ని ప్రైజ్ మ‌నీ ప్ర‌క‌టించింది. ఇందులో భాగంగా భార‌త మ‌హిళా జ‌ట్టుకు ఊహించ‌ని గిఫ్ట్ ఇచ్చింది. ఐసీసీ చైర్మ‌న్ జే షా చేసిన సూచ‌న మేర‌కు బీసీసీఐ చీఫ్ , కార్య‌వ‌ర్గం ఏకంగా రూ. 51 కోట్ల బ‌హుమ‌తి ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు రాజీవ్ శుక్లా. ఇదిలా ఉండ‌గా గోవింద్ ధోలాకియాతో పాటు భార‌త దేశానికి చెందిన కంపెనీలు, పారిశ్రామిక‌వేత్త‌లు ఉమెన్ ఇన్ బ్లూ టీంకు న‌జ‌రానాలు ప్ర‌క‌టించేందుకు పోటీ ప‌డుతున్నారు.

  • Related Posts

    ఇంగ్లండ్ రాణిస్తుందా ఇండియా గెలుస్తాందా

    Spread the love

    Spread the loveటి20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2వ సెమీ ఫైన‌ల్ మ్యాచ్ నేడు ముంబై : అంద‌రి క‌ళ్లు ఇప్పుడు భార‌త జ‌ట్టుపైనే ఉన్నాయి. ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను కైవ‌సం చేసుకునేందుకు ఇంకా ఒకే ఒక్క అడుగు దూరంలో…

    ఫిన్ అలెన్ విధ్వంసం దక్షిణాఫ్రికా ప‌రాజ‌యం

    Spread the love

    Spread the loveఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిన కీవీస్ బ్యాట‌ర్ కోల్ క‌తా : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ చ‌రిత్ర‌లో అరుదైన రికార్డు న‌మోదు చేశాడు న్యూజిలాండ్ కు చెందిన క్రికెట‌ర్ ఫిన్ అలెన్. కోల్ క‌తా లోని ఈడెన్ గార్డెన్స్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *