మొంథా తుపాను ప్రభావంపై అధ్యయనం
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో కేంద్ర అధికారులతో కూడిన బృందం మంగళవారం అమరావతి లోని సచివాలయంలో భేటీ అయ్యింది. ఇటీవల రాష్ట్రంపై భారీ ఎత్తున విరుచుకు పడింది మొంథా తుపాను. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. ఏకంగా 20 లక్షల ఎకరాలకు పైగా పంటలు కోల్పోయినట్లు ప్రాథమిక అంచనా. ఇదిలా ఉండగా ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి రూ. 20 వేల కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా కేంద్రం శీతకన్ను ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ఇదిలా ఉండగా ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా సర్కార్ ఆదుకుంటుందని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.
ఇదిలా ఉండగా విరుచుకుపడిన మొంథా తుపాను నష్టంపై అంచనాలు రూపొందించేందుకు రాష్ట్రంలో పర్యటించింది కేంద్ర టీం. ఈ సందర్బంగా ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యింది. కాగా కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పాసుమీ బసు ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో వేర్వేరు ప్రాంతాలను కేంద్ర బృందం సందర్శించింది. రూ.5,267 కోట్ల మేర తుపాను నష్టం వాటిల్లినట్టు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇప్పటికే ఓ మధ్యంతర నివేదిక ఇచ్చింది. తక్షణ సాయంగా రూ.2,622 కోట్లను మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు ఈ సందర్బంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు.






