వ‌ర‌సిద్ది వినాయ‌కుడికి పట్టు వ‌స్త్రాల స‌మ‌ర్ప‌ణ

Spread the love

టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు దంప‌తులు

తిరుప‌తి : తిరుప‌తిలోని కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం టిటిడి తరఫున టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు.కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి తిరు కల్యాణం సంద‌ర్భంగా టిటిడి త‌ర‌ఫున‌ పట్టు వస్త్రాలు అంద‌జేశారు. ప్ర‌తి ఏడాదీ బ్ర‌హ్మోత్స‌వాల్లో ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌డం ఆనవాయితీగా వస్తోంది.

ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టిటిడి చైర్మెన్ కు ఆల‌య ఈవో పెంచెల కిషోర్ కుమార్, ఏఈవో రవీంద్ర బాబు, అర్చకులు సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయ ప్రదక్షిణం చేసి గర్భాలయంలో స్వామి వారికి వస్త్ర సమర్పణ చేశారు. ద‌ర్శ‌నానంత‌రం వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాధం, బొక్కసం ఇంఛార్జి గురురాజ స్వామి, సిబ్బంది పాల్గొన్నారు. అంత‌కు ముందు వ‌ర‌సిద్ది వినాయ‌క స్వామి ఆల‌యానికి పెద్ద ఎత్తున భ‌క్తులు త‌ర‌లి వ‌చ్చారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఇటీవ‌లే అన్న‌దానం కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు.

  • Related Posts

    అంగ‌రంగ వైభ‌వంగా ప్ర‌భ‌ల తీర్థం పండుగ‌

    Spread the love

    Spread the loveరాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన చంద్ర‌బాబు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రభల తీర్థం పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ. పురాతన శివాలయాల నుండి ఏకాదశ రుద్రులను (శివుని పదకొండు రూపాలు)…

    సీఎం చంద్ర‌బాబు దంప‌తులకు శ్రీ‌వారి ప్ర‌సాదం

    Spread the love

    Spread the loveనారా వారి ప‌ల్లెలో అందించిన‌ ఈవో సింఘాల్ తిరుప‌తి జిల్లా : సంక్రాంతి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా చిత్తూరు జిల్లాలోని నారా వారి ప‌ల్లెలో ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, భార్య నారా భువ‌నేశ్వ‌రి, కోడ‌లు నారా బ్రాహ్మ‌ణి,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *