ఓవరాల్ ఛాంపియ‌న్స్ కు సీఎం అభినంద‌న

తెలంగాణ ఈఎంఆర్ఎస్ అభ్య‌ర్థుల‌కు కంగ్రాట్స్

హైద‌రాబాద్ : జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలోని ఈఎంఆర్ఎస్ కు చెందిన విద్యార్థులు అరుదైన ఘ‌న‌త సాధించారు. ఏకంగా వివిధ విభాగాల‌లో జ‌రిగిన పోటీల‌లో 230 ప‌త‌కాల‌ను సాధించారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్ర గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ ఆధ్వ‌ర్యంలో 4వ EMRS నేషనల్ స్పోర్ట్స్ మీట్-2025లో ఓవరాల్ ఛాంపియన్ షిప్ ను సాధించిన తెలంగాణ విద్యార్థులు కలిశారు. వారిని పేరు పేరునా ప‌ల‌క‌రించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సంద‌ర్బంగా వారిని ప్ర‌శంస‌లతో ముంచెత్తారు.

అథ్లెటిక్స్, ఆర్చరీ, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, బాక్సింగ్, జూడో, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, టైక్వాండో, యోగా, షూటింగ్, చెస్ ఇతర ఈవెంట్లలో అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా తెలంగాణ యువత 230 పతకాలను సాధించడం ప‌ట్ల త‌న‌కు , ప్ర‌భుత్వానికి గ‌ర్వంగా ఉంద‌న్నారు. ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌న‌లు చేశారు సీఎం. త‌మ స‌ర్కార్ క్రీడ‌ల‌కు అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని చెప్పారు. పెద్ద ఎత్తున నిధుల‌ను కేటాయిస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌త్యేకించి క్రీడా పాల‌సీని కూడా త‌యారు చేస్తున్నామ‌న్నారు. ఆయా విద్యా సంస్థ‌ల బ‌లోపేతానికి కృషి చేస్తున్నామ‌న్నారు.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *