ఓవరాల్ ఛాంపియ‌న్స్ కు సీఎం అభినంద‌న

Spread the love

తెలంగాణ ఈఎంఆర్ఎస్ అభ్య‌ర్థుల‌కు కంగ్రాట్స్

హైద‌రాబాద్ : జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలోని ఈఎంఆర్ఎస్ కు చెందిన విద్యార్థులు అరుదైన ఘ‌న‌త సాధించారు. ఏకంగా వివిధ విభాగాల‌లో జ‌రిగిన పోటీల‌లో 230 ప‌త‌కాల‌ను సాధించారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్ర గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ ఆధ్వ‌ర్యంలో 4వ EMRS నేషనల్ స్పోర్ట్స్ మీట్-2025లో ఓవరాల్ ఛాంపియన్ షిప్ ను సాధించిన తెలంగాణ విద్యార్థులు కలిశారు. వారిని పేరు పేరునా ప‌ల‌క‌రించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సంద‌ర్బంగా వారిని ప్ర‌శంస‌లతో ముంచెత్తారు.

అథ్లెటిక్స్, ఆర్చరీ, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, బాక్సింగ్, జూడో, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, టైక్వాండో, యోగా, షూటింగ్, చెస్ ఇతర ఈవెంట్లలో అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా తెలంగాణ యువత 230 పతకాలను సాధించడం ప‌ట్ల త‌న‌కు , ప్ర‌భుత్వానికి గ‌ర్వంగా ఉంద‌న్నారు. ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌న‌లు చేశారు సీఎం. త‌మ స‌ర్కార్ క్రీడ‌ల‌కు అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని చెప్పారు. పెద్ద ఎత్తున నిధుల‌ను కేటాయిస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌త్యేకించి క్రీడా పాల‌సీని కూడా త‌యారు చేస్తున్నామ‌న్నారు. ఆయా విద్యా సంస్థ‌ల బ‌లోపేతానికి కృషి చేస్తున్నామ‌న్నారు.

  • Related Posts

    ఈ గెలుపు ఆత్మ విశ్వాసాన్ని పెంచేలా చేసింది

    Spread the love

    Spread the loveమాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు ముంబై : ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై వాంఖ‌డే స్టేడియంలో జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు 6 వికెట్ల తేడాతో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ను…

    కోల్ క‌తా త‌ర‌పున ఆడ‌డం గ‌ర్వంగా ఉంది

    Spread the love

    Spread the loveస్టార్ బౌల‌ర్ సునీల్ న‌రైన్ కామెంట్స్ హైద‌రాబాద్ : ఐపీఎల్ మెగా టోర్నీ చ‌రిత్ర‌లో తాను 200 వికెట్లు పడ‌గొట్ట‌డం ప‌ట్ల సంతోషంగా ఉంద‌న్నాడు స్టార్ బౌల‌ర్ సునీల్ న‌రైన్. కీల‌క పోరులో భాగంగా హైద‌రాబాద్ లోని ఉప్ప‌ల్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *