నిస్వార్థ సేవ‌తోనే జీవితానికి సార్థ‌క‌త : సీఎం

Spread the love

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన చంద్ర‌బాబు నాయుడు

పుట్ట‌ప‌ర్తి జిల్లా : భ‌గ‌వాన్ శ్రీ స‌త్య‌సాయిబాబా జీవితం ఎంద‌రికో స్పూర్తిని క‌లిగిస్తోంద‌ని అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఉచిత విద్య , నిస్వార్థ సేవ‌తోనే జీవితానికి సార్థ‌క‌త ల‌భిస్తుంద‌ని చెప్పారు. పుట్టప‌ర్తిలో జ‌రిగిన స్నాత‌కోత్స‌వంలో ఉప రాష్ట్ర‌ప‌తి రాధాకృష్ణ‌న్ తో క‌లిసి పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా సీఎం ప్ర‌సంగించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బలమైన నాయకత్వం మనకు ఉందన్నారు. ఈ అనుకూలతలన్నీ సద్వినియోగం చేసుకోవడం ద్వారా దేశం 10వ స్థానం నుంచి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని చెప్పారు. 2047 నాటికి మనం ప్రపంచంలోనే నంబర్ వన్ దేశంగా అవతరిస్తాం అన్నారు సీఎం. దీనిని సాధించడానికి మనం భవిష్యత్తు రంగాలు అయిన AI-డేటా సెంటర్లు, క్వాంటం, ఏరోస్పేస్, డ్రోన్, అంతరిక్షం, సెమీకండక్టర్, రక్షణ రంగాలలోని పెట్టుబడులపై దృష్టి సారిస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. దేశంలో ఉన్న అన్ని ఫ్యూచర్ టెక్నాలజీలను ఏపీకి తెస్తున్నామ‌ని చెప్పారు.

సీఐఐ సదస్సులో రూ. 13.25 లక్షల పెట్టుబడులు తెచ్చామన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. 16 లక్షల ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు డేటా సెంటర్ కోసం 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులను గూగుల్ పెట్టనుందన్నారు. వినూత్న ఆలోచనలకు ఆర్టీఐహెచ్ వేదిక. కొత్త ఆలోచనలతో వచ్చిన వారితో కంపెనీలు పెట్టించేలా చూస్తున్నామ‌న్నారు. ఒన్ ఫ్యామ్లీ-ఒన్ ఎంటర్ ప్రెన్యూర్, ఒన్ ఫ్యామ్లీ-ఒన్ ఏఐ టెక్నిషీయన్ అనే సిద్దాంతంతో పని చేస్తున్నట్లు తెలిపారు సీఎం. భారత దేశంలో తెలుగు వాళ్లు నెంబర్-1గా ఉండేలా పని చేస్తున్నమ‌ని అన్నారు. నైపుణ్యమున్న యువతదే అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర. విద్యార్థులు, యువతే దేశానికి సంరక్షకులు అని చెప్పారు.

  • Related Posts

    ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆట‌లు ఇక్క‌డ సాగ‌వు

    Spread the love

    Spread the loveస్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పొన్నం ప్ర‌భాక‌ర్ హైద‌రాబాద్ : మ‌రోసారి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నాయ‌కుల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే తెలంగాణ‌కు చెందిన మేధావులు, ప్ర‌జాస్వామిక‌వాదులు, క‌ళాకారులు, క‌వులు, అమ‌రవీరుల కుటుంబాలు, జ‌ర్న‌లిస్టులు సైతం భ‌గ్గుమంటున్నారు.…

    మ‌య‌న్మార్ అధ్య‌క్షుడితో పీఎం మోదీ భేటీ

    Spread the love

    Spread the loveప్రధానమంత్రి హైదరాబాద్ హౌస్‌లో మీటింగ్ న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మయన్మార్ అధ్యక్షుడు మిన్ ఆంగ్ హ్లాయింగ్ సోమవారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఒకరినొకరు పలకరించుకుని కరచాలనం చేసుకున్నారు. ఒక అధికారిక కార్యక్రమంలో భాగంగా భారత, మయన్మార్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *