నిస్వార్థ సేవ‌తోనే జీవితానికి సార్థ‌క‌త : సీఎం

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన చంద్ర‌బాబు నాయుడు

పుట్ట‌ప‌ర్తి జిల్లా : భ‌గ‌వాన్ శ్రీ స‌త్య‌సాయిబాబా జీవితం ఎంద‌రికో స్పూర్తిని క‌లిగిస్తోంద‌ని అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఉచిత విద్య , నిస్వార్థ సేవ‌తోనే జీవితానికి సార్థ‌క‌త ల‌భిస్తుంద‌ని చెప్పారు. పుట్టప‌ర్తిలో జ‌రిగిన స్నాత‌కోత్స‌వంలో ఉప రాష్ట్ర‌ప‌తి రాధాకృష్ణ‌న్ తో క‌లిసి పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా సీఎం ప్ర‌సంగించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బలమైన నాయకత్వం మనకు ఉందన్నారు. ఈ అనుకూలతలన్నీ సద్వినియోగం చేసుకోవడం ద్వారా దేశం 10వ స్థానం నుంచి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని చెప్పారు. 2047 నాటికి మనం ప్రపంచంలోనే నంబర్ వన్ దేశంగా అవతరిస్తాం అన్నారు సీఎం. దీనిని సాధించడానికి మనం భవిష్యత్తు రంగాలు అయిన AI-డేటా సెంటర్లు, క్వాంటం, ఏరోస్పేస్, డ్రోన్, అంతరిక్షం, సెమీకండక్టర్, రక్షణ రంగాలలోని పెట్టుబడులపై దృష్టి సారిస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. దేశంలో ఉన్న అన్ని ఫ్యూచర్ టెక్నాలజీలను ఏపీకి తెస్తున్నామ‌ని చెప్పారు.

సీఐఐ సదస్సులో రూ. 13.25 లక్షల పెట్టుబడులు తెచ్చామన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. 16 లక్షల ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు డేటా సెంటర్ కోసం 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులను గూగుల్ పెట్టనుందన్నారు. వినూత్న ఆలోచనలకు ఆర్టీఐహెచ్ వేదిక. కొత్త ఆలోచనలతో వచ్చిన వారితో కంపెనీలు పెట్టించేలా చూస్తున్నామ‌న్నారు. ఒన్ ఫ్యామ్లీ-ఒన్ ఎంటర్ ప్రెన్యూర్, ఒన్ ఫ్యామ్లీ-ఒన్ ఏఐ టెక్నిషీయన్ అనే సిద్దాంతంతో పని చేస్తున్నట్లు తెలిపారు సీఎం. భారత దేశంలో తెలుగు వాళ్లు నెంబర్-1గా ఉండేలా పని చేస్తున్నమ‌ని అన్నారు. నైపుణ్యమున్న యువతదే అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర. విద్యార్థులు, యువతే దేశానికి సంరక్షకులు అని చెప్పారు.

  • Related Posts

    నా కొడుకు డ్రగ్స్ తీసుకోలేదు : ఎమ్మెల్సీ వెంక‌ట్రాం రెడ్డి

    హైద‌రాబాద్ : భార‌త రాష్ట్ర స‌మితి పార్టీకి చెందిన శాస‌న మండ‌లి స‌భ్యుడు (ఎమ్మెల్సీ) వెంక‌ట్రాం రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌న కొడుకు భ‌ర‌త్ రాజ్ రెడ్డి గురించి అవాస్త‌వాలు ప్ర‌చారం చేస్తున్నార‌ని, ఎలాంటి…

    కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం

    న్యూఢిల్లీ : సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ అధ్య‌క్ష‌త‌న గురువారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం న్యూఢిల్లీలో ఏఐసీసీ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *