శ్రీ రంగనాథ స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ

Spread the love

ద‌ర్శించుకున్న టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు

త‌మిళ‌నాడు : కైశిక ఏకాదశి సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామివారికి సతీ సమేతంగా సోమ‌వ‌వారం తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం పాల‌క డండ‌లి ( టిటిడి) తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు చైర్మ‌న్ బీఆర్ నాయుడు. శ్రీరంగం ఆలయ జాయింట్ కమిషనర్ పి. శివరామన్ , ప్రధాన అర్చకులు శ్రీ సుందర భట్టర్ సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు.

పట్టు వస్త్రాలను ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి సమర్పించారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు . ఇదిలా ఉండ‌గా 2006 నుంచి ప్రాచీన శ్రీ వైష్ణవ క్షేత్రాలతో ఆధ్యాత్మిక అనుబంధాన్ని కొనసాగిస్తూ టిటిడి తరఫున శ్రీరంగానికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోంద‌ని చెప్పారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయ‌యుడు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు నరేష్ కుమార్ , అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

  • Related Posts

    శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు

    Spread the love

    Spread the loveడిసెంబ‌ర్ 16 నుంచి జ‌న‌వ‌రి 15 వ‌ర‌కు చిత్తూరు జిల్లా : శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం లో మంగ‌ళ‌వారం నుంచి వ‌చ్చే జ‌న‌వ‌రి 15 వ‌ర‌కు విశిష్ట పూజ‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆల‌య క‌మిటీ పేర్కొంది. మంగళవారం నుండి 15న…

    తిరుమ‌ల‌లో సామాన్య భ‌క్తుల‌కే పెద్ద‌పీట‌

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు తిరుమ‌ల : తిరుమ‌ల‌లో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌కు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు. ఆయ‌న ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తో క‌లిసి మీడియాతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *