శ్రీ రంగనాథ స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ

Spread the love

ద‌ర్శించుకున్న టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు

త‌మిళ‌నాడు : కైశిక ఏకాదశి సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామివారికి సతీ సమేతంగా సోమ‌వ‌వారం తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం పాల‌క డండ‌లి ( టిటిడి) తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు చైర్మ‌న్ బీఆర్ నాయుడు. శ్రీరంగం ఆలయ జాయింట్ కమిషనర్ పి. శివరామన్ , ప్రధాన అర్చకులు శ్రీ సుందర భట్టర్ సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు.

పట్టు వస్త్రాలను ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి సమర్పించారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు . ఇదిలా ఉండ‌గా 2006 నుంచి ప్రాచీన శ్రీ వైష్ణవ క్షేత్రాలతో ఆధ్యాత్మిక అనుబంధాన్ని కొనసాగిస్తూ టిటిడి తరఫున శ్రీరంగానికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోంద‌ని చెప్పారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయ‌యుడు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు నరేష్ కుమార్ , అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఘనంగా చంద్రన్న జన్మదిన వేడుకలు

    Spread the love

    Spread the loveభారీ ఎత్తున హాజ‌రైన టీడీపీ కార్య‌క‌ర్త‌లు శ్రీ స‌త్య‌సాయి జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు పుట్టిన రోజు ఇవాళ‌. ఈ సంద‌ర్బంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఘ‌ఘ‌నంగా వేడుక‌లు చేప‌ట్టారు. ప‌లువురు…

    సీఎం జ‌న్మ‌దినం టీటీడీ అన్న ప్ర‌సాదానికి విరాళం

    Spread the love

    Spread the loveరూ. 44 ల‌క్ష‌లు ఇచ్చిన భాష్యం విద్యా సంస్థ‌లు తిరుమ‌ల : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు ఏప్రిల్ 20. ఆయ‌న బ‌ర్త్ డే సంద‌ర్బంగా ఇవాళ తిరుమ‌ల‌లోని అన్న ప్రసాదానికి రూ.44 లక్షల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *