భార‌త రాజ్యాంగం అత్యున్న‌త‌మైన‌ది

పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్

మంగ‌ళ‌గిరి : ప్ర‌పంచంలోనే అత్యున్న‌త‌మైన‌ది భార‌త రాజ్యాంగం అని అన్నారు రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్. సోమ‌వారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జ‌రిగాయి. ఈ సంద‌ర్బంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ . గౌరవ వందనం పోలీసుల నుంచి స్వీక‌రించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేశారు. పార్టీ నేతలకు, కార్యాలయ సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గార్డులు వందనం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ చిల్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాసరావు, పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు సయ్యద్ జిలానీ, నయబ్ కమల్, గంజి చిరంజీవి, బేతపూడి విజయ శేఖర్, గరికపాటి శివశంకర్, రావి సౌజన్య, పార్వతి నాయుడు, శివ పార్వతి, మండలి రాజేష్, తోట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *