newsseals.com
ENTERTAINMENT

పాట‌ల కోయిల‌మ్మా వ‌ర్దిల్ల‌వ‌మ్మా..!

VijayaBhaskar January 27, 2026
newsseals-SJanaki
Spread the love

ప‌ద్మభూష‌ణ్ అవార్డును తిర‌స్క‌రణ

అమ‌రావ‌తి : ఆత్మ గౌర‌వం క‌లిగిన అరుదైన గాయ‌ని ఎస్. జాన‌కి. త‌ను ప‌లు భాష‌ల‌లో వేల పాట‌లు పాడారు. త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ఎక్కువ పాట‌లు దివంగ‌త గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యంతో క‌లిసి పాడారు. ఆమె దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించారు ఆ మ‌ధ్య‌న కేంద్రం ప్ర‌క‌టించిన అత్యున్న‌త అవార్డు ప‌ద్మ‌భూష‌ణ్ ను . ఈ దేశ మూల వాసులైన‌ దక్షిణ భారతీయ‌, ద్రావిడలకు జరుగుతున్న అన్యాయంపై నిరసన తెలిపారు. మెరుగైన వ్య‌క్తిత్వం క‌లిగిన గాయ‌ని త‌ను. త‌ను ఒక‌టా రెండా ఏకంగా 18కి పైగా భాష‌ల‌లో పాట‌లు పాడారు ఎస్. జాన‌కి. వాటిలో ఎక్కువ‌గా తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, బెంగాలీ, హిందీ, ఒరియా, సింహళం, తులు, కొంకణి, ఉర్దూ, మరాఠీ , త‌దిత‌ర భాష‌లు ఉన్నాయి.

40 వేల‌కు పైగా పాట‌లు పాడారు జాన‌క‌మ్మ‌. ఇందులో ఎక్కువ‌గా సినిమా పాట‌లు, భ‌క్తి గీతాలు, ల‌లిత గీతాలు, జాన‌ప‌ద గీతాలు ఉన్నాయి. ఎస్. జానకి గారు కేవలం గొప్ప గాయని మాత్రమే కాదు, భాషల సరిహద్దులు చెరిపేసిన స్వరం. ఒకే గొంతుతో అమాయకత్వం, వేదన, భక్తి, ప్రేమ, విరహం అన్నీ వ్యక్తపరచగల అద్భుత కళాకారిణి. ప్రతి భాషను ఆ భాషలా పలికించిన స్వచ్ఛత, ప్రతి పాత్రకు ప్రాణం పోసిన భావవ్యక్తీకరణ, సంగీత దర్శకుల కలలను నిజం చేసిన క్రమశిక్షణ ఇవన్నీ కలిసి ఆమెను పాటల తల్లిగా నిలబెట్టాయి. దశాబ్దాల తరబడి తరతరాల హృదయాల్లో నిలిచి పోయిన ఆమె స్వరం, కాలం మారినా విలువ తగ్గని సంగీత సంస్కృతికి చిరునామాగా నిలుస్తుంది.