ప్ర‌ధాని మోదీ ఆలోచ‌నా విధానం అద్బుతం

Spread the love

ప్ర‌శంస‌లు కురిపించిన క్రికెట‌ర్ ర‌వీంద్ర జ‌డేజా

న్యూఢిల్లీ : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని క‌ల‌వ‌డం ఆనందంగా ఉంద‌న్నారు ప్ర‌ముఖ క్రికెట‌ర్ రవీంద్ర జ‌డేజా. త‌న స‌తీమ‌ణి , మంత్రి రివాబా జ‌డేజాతో క‌లిసి పీఎం నివాసంలో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఈ సంద‌ర్బంగా ప‌లు అంశాల‌పై వీరు చ‌ర్చించారు. ప్ర‌ధాని తో క‌లిసిన అనంత‌రం ర‌వీంద్ర జ‌డేజా, రివాబా జ‌డేజా మీడియాతో మాట్లాడారు న్యూఢిల్లీలో. ప్రధాని మోదీతో సంభాషించే అవకాశం లభించడం గొప్ప అదృష్టం, గౌరవం అన్నారు. ఆయ‌న‌తో క‌లిసిన ప్ర‌తీసారి ఏదో ఒక కొత్త అంశం త‌మ ముందుకు వ‌స్తుంద‌న్నారు ర‌వీంద్ర జ‌డేజా.

ప్ర‌ధానంగా దేశ ప్ర‌ధాన‌మంత్రి విధి నిర్వ‌హ‌ణ‌లో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ తాము అడిగిన వెంట‌నే క‌లిసేందుకు అవ‌కాశం ఇవ్వ‌డం సంతోషంగా ఉంద‌న్నారు స్టార్ క్రికెట‌ర్. ప్ర‌త్యేకించి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ ఆలోచ‌నా విధానం, ఉత్సాహం, అంకిత భావం కోట్లాది మందికి స్పూర్తిని క‌లిగిస్తూనే ఉంటుంద‌న్నారు ర‌వీంద్ర జ‌డేజా. ఆయ‌న లాంటి వ్య‌క్తిని తాము ఇంత వ‌ర‌కు చూడ‌లేద‌న్నారు. అందుకే ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌పంచంలోనే అత్యున్న‌త‌మైన‌, స‌మ‌ర్థ‌వంతుడైన నాయ‌కుడిగా గుర్తింపు పొందుతున్నాడ‌ని పేర్కొన్నారు ర‌వీంద్ర జ‌డేజా. ఇదిలా ఉండ‌గా ఇటీవల బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టులో ఏ గ్రేడ్ లో జడేజా ఉండగా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బీ గ్రేడ్ లకు పడిపోవడం సంచలనంగా మారింది.

  • Related Posts

    అమెరికా క్రికెట్ జ‌ట్టుకు ట్రంప్ కంగ్రాట్స్

    Spread the love

    Spread the loveభార‌త్ తో ఓడి పోయినా బాగా ఆడార‌ని కితాబు అమెరికా : అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌నంగా మారారు. త‌న స్వంత సామాజిక మాధ్య‌మం ట్రూత్ సోష‌ల్ వేదిక‌గా ప్ర‌స్తుతం భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న…

    న‌మీబియాతో ఆడ‌నున్న సంజూ శాంస‌న్ ..?

    Spread the love

    Spread the loveక‌డుపు నొప్పితో ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ దూరం న్యూఢిల్లీ : భార‌త్, శ్రీ‌లంక సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా న్యూఢిల్లీలో జ‌ర‌గ‌నుంది రెండో మ్యాచ్. ఈ మ్యాచ్ లో స్టార్ ఓపెన‌ర్ అభిషేక్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *