భారత దేశంతో బంగ్లాదేశ్ స్నేహ హ‌స్తం

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన క్రీడా శాఖ మంత్రి

బంగ్లాదేశ్ : ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీ జ‌రుగుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. నిన్న‌టి దాకా భార‌త్ తో క‌య్యానికి కాలు దువ్విన బంగ్లాదేశ్ స‌ర్కార్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఆ దేశానికి నూత‌న ప్ర‌ధాన‌మంత్రి గా రెహ‌మాన్ కొలువు తీరారు. ఆయ‌న‌తో పాటు కొత్త మంత్రివ‌ర్గం ప్ర‌మాణ స్వీకారం చేసింది. ఈ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్రమానికి భార‌త దేశం త‌ర‌పున స్పీక‌ర్ ఓం బిర్లా హాజ‌ర‌య్యారు. ఇదిలా ఉండ‌గా బంగ్లాదేశ్ కు చెందిన కొత్త‌గా కొలువు తీరిన క్రీడా శాఖ మంత్రి . టి20 ప్రపంచ కప్ డ్రామా తర్వాత భారతదేశం పట్ల స్నేహపూర్వక హస్తం చాచారు, సంబంధాలను చక్క దిద్దు కోవాలని చూస్తున్నారు.

ఈ సంద‌ర్బంగా ఆయ‌న ఇలా అన్నారు. పార్లమెంటు భవనంలో భారత డిప్యూటీ హైకమిషనర్‌ను కలిశాను. ఈ విషయం (T20 ప్రపంచ కప్ సమస్య) గురించి నేను అతనితో చర్చించాను, అతను చాలా స్నేహపూర్వకంగా ఉన్నాడు . మన పొరుగు దేశాలన్నింటితో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలని అనుకుంటున్నందున చర్చల ద్వారా ఈ సమస్యను త్వరగా పరిష్కరించు కోవాల‌ని స్ప‌ష్టం చేశాన‌ని తెలిపారు. క్రీడల నుండి అన్ని ఇతర రంగాల వరకు ఇదే ఒర‌వడి కొన‌సాగించాల‌ని నిర్ణ‌యిం తీసుకున్నామ‌న్నారు.

  • Related Posts

    వైభ‌వ్ సూర్య‌వంశీ ఎంపిక క‌రెక్టు కాదు

    హైద‌రాబాద్ : ప్ర‌ముఖ క్రికెట్ అనలిస్ట్, కామెంటేట‌ర్ హ‌ర్ష భోగ్లే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇంగ్లండ్ టూర్ లో భాగంగా శ్రేయ‌స్ అయ్య‌ర్ నాయ‌క‌త్వంలో టీమిండియా టి20 సీరీస్ ను కోల్పోయింది. ఆఖ‌రి మ్యాచ్ లోనూ చేతులెత్తేశారు. ప్ర‌ధాన ఆట‌గాళ్లు ఆశించిన…

    వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్ లో ఎంఎస్ ధోనీ ఆడ‌టం క‌ష్ట‌మే

    చెన్నై : భార‌త దేశ క్రికెట్ రంగంలో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ఏకైక క్రికెట‌ర్ జార్ఖండ్ డైన‌మెట్ మ‌హేంద్ర సింగ్ ధోనీ. త‌న సార‌థ్యంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ ప‌లుమార్లు ఐపీఎల్ టైటిళ్ల‌ను స్వంతం చేసుకుంది. ప‌లువురిని మార్చింది సీఎస్కే యాజ‌మాన్యం.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *