ఇండియా గెలిచేనా సెమీ ఫైన‌ల్ కు చేరేనా

కోల్ క‌తా వేదిక‌గా ఇండియా వ‌ర్సెస్ విండీస్

కోల్ క‌తా : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. ఆదివారం అత్యంత కీల‌క‌మైన మ్యాచ్ ఆడ‌బోతోంది సూర్య కుమార్ యాద‌వ్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు. ఇప్ప‌టికే సూప‌ర్ -8 లో మూడు జ‌ట్లు సెమీస్ కు చేరుకున్నాయి. ఇక నాలుగో స్థానం కోసం పోటీ కొన‌సాగుతోంది. ఇవాళ జ‌రిగే మ్యాచ్ లో ఎవరు విజ‌యం సాధిస్తారో వారే సెమీస్ కు చేరుకుంటారు. దీంతో భార‌త జ‌ట్టుపై తీవ్ర‌మైన ఒత్తిడి నెల‌కొంది. ఇప్ప‌టికే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఛాంపియ‌న్ గా ఉంది టీమిండియా. కోల్ క‌తా లోని ఈడెన్ గార్డెన్స్ లో ఇండియా, విండీస్ మ‌ధ్య పోరు కొన‌సాగ‌నుంది.

ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీఫైనల్స్‌కు దాదాపుగా చేరుతుంది కాబట్టి ఈ మ్యాచ్ కూడా ప్రత్యేకమైనది. సంజు సామ్సన్‌ను మరోసారి ప్లేయింగ్ 11 నుంచి తొలగించే అవకాశం ఉంది. సంజు తనకు ఇచ్చిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోలేదని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఇంతలో, రింకు సింగ్ తన తండ్రి మరణం తర్వాత ఇంటికి వెళ్లిపోయాడు, కానీ నిన్న తిరిగి జట్టులో చేరాడు. కోచ్ గౌత‌మ్ గంభీర్, కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ రింకు సింగ్‌పై ఎక్కువ నమ్మకం ఉంచినట్లు కనిపిస్తోంది. కాబట్టి అతని పునరాగమనం దాదాపు ఖాయం అని భావిస్తున్నారు. ఇప్పుడు, ఈ పెద్ద మ్యాచ్‌లో జట్టు యాజమాన్యం ఎవరిని విశ్వసిస్తుందో అనేది ఉత్కంఠ రేపుతోంది.

  • Related Posts

    తెలంగాణ‌లో రూ. 30 కోట్ల‌తో క్రీడా స‌దుపాయాల క‌ల్ప‌న

    హైద‌రాబాద్ : తెలంగాణ‌కు ఖేలో ఇండియా యూత్ పోటీల నిర్వ‌హ‌ణ‌ను కేటాయించ‌డం ప‌ట్ల పీఎం మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. దాదాపు రూ.30 కోట్లతో క్రీడా సదుపాయాల‌ కల్పన జరిగిందన్నారు.…

    మేధావి బిధూరి సోష‌ల్ మీడియాలో వైర‌ల్

    ఢిల్లీ : మ‌హిళా క్రికెట్ రంగంలో మ‌రో తార వెలుగులోకి వ‌చ్చింది. సోష‌ల్ మీడియాలో ఇప్పుడు మేధావి బిధూరి సెన్సేష‌న్ గా మారారు. సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా నిలిచింది. త‌ను అనుకోకుండా చేసిన హావ‌భావాల‌తో కూడిన వీడియోలు ఇప్పుడు చ‌క్క‌ర్లు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *