సంజు శాంస‌న్ అద్భుతంగా ఆడాడు

Spread the love

జ‌ట్టుకు కావాల్సింది త‌న నుంచి ఇదే

చెన్నై : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా త‌మిళ‌నాడు రాష్ట్ర రాజ‌ధాని చెన్నై వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్ లో అద్భుత‌మైన ఆట తీరును ప్ర‌ద‌ర్శించింది భార‌త జ‌ట్టు. డిఫెండింగ్ ఛాంపియ‌న్ గా ఉన్న టీమిండియా ప్ర‌స్తుతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. సెమీ ఫైన‌ల్ కు చేరాలంటే త‌ప్ప‌నిస‌రిగా జింబాబ్వేతో పాటు వెస్టిండీస్ మ‌ధ్య ఆడాల్సి ఉంది. దీంతో చావో రేవో తేల్చుకునేందుకు రెడీ అయ్యింది. ఆట తీరుతో ఆక‌ట్టుకుంది. నిన్న‌టి దాకా ఆయా మ్యాచ్ ల‌లో ఆడ‌కుండా ప‌క్క‌న పెట్టిన సంజూ శాంసన్ ను జింబాబ్వేతో జ‌రిగిన మ్యాచ్ లో తీసుకున్నారు. టీం ఇండియా తొలుత బ్యాటింగ్ కు దిగింది. పొట్టి ఫార్మాట్ లో భారీ స్కోర్ సాధించి రికార్డు న‌మోదు చేసింది. కేవ‌లం 4 వికెట్లు కోల్పోయి 256 ప‌రుగులు చేసింది టీంఇండియా.

సంజూ శాంస‌న్ 24 ర‌న్స్ చేస్తే, అభిషేక్ శ‌ర్మ 55, సూర్య కుమార్ యాద‌వ్ 38, ఇసాన్ కిష‌న్ 28, తిల‌క్ వ‌ర్మ 44 , హార్దిక్ పాండ్యా 50 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచారు. అనంత‌రం బ‌రిలోకి దిగిన జింబాబ్వే ఆశించిన మేర ఎదుర్కోలేక పోయింది భార‌త బౌల‌ర్ల‌ను. మ్యాచ్ ముగిశాక కామెంటేట‌ర్ , మాజీ క్రికెట‌ర్ దినేష్ కార్తీక్ మీడియాతో మాట్లాడారు. త‌ను ప్ర‌త్యేకించి సంజు శాంస‌న్ గురించి ప్ర‌స్తావించాడు. సంజు సామ్సన్ జట్టు తన నుండి ఆశించిన విధంగానే ఆడాడు. అతను జట్టును అద్భుతంగా ప్రారంభించాడు, అభిషేక్ పై ఒత్తిడిని తగ్గించాడు .అవసరమైన రిస్క్‌లు తీసుకున్నాడు. అయితే మీరు రిస్క్‌లు తీసుకున్నప్పుడు, కొన్నిసార్లు తప్పులు చేయడం ఖాయం అన్నాడు.

క్రికెట్ నిపుణులు చివరకు సంజును అభినందిస్తున్నట్లు చూడటం మంచిది. అతను జట్టు అతని నుండి ఏమి అడిగిందో ఖచ్చితంగా అందించాడు. జట్టు కోసం తన పాత్రను అద్భుతంగా పోషించాడు

  • Related Posts

    డిఫెండింగ్ ఛాంపియ‌న్ సూప‌ర్ షో

    Spread the love

    Spread the loveమ‌రోసారి స‌త్తా చాటిన విరాట్ కోహ్లీ బెంగ‌ళూరు : ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు దుమ్ము రేపుతోంది. వ‌రుస విజ‌యాలతో స‌త్తా చాటుతోంది. ర‌జిత్ పాటిదార్ నాయ‌క‌త్వంలోని ఈ జ‌ట్టు ఊహించ‌ని విధంగా గెలుస్తూ…

    క్రీడా రంగంలో ఏపీని టాప్ లో నిలుపుతాం

    Spread the love

    Spread the loveకీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి నారా లోకేష్ తిరుప‌తి జిల్లా : ఏపీని క్రీడా రంగంలో టాప్ లో నిలిపేందుకు కృషి చేస్తామ‌ని ప్ర‌క‌టించారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌. బుధ‌వారం తిరుపతిలోని శ్రీ శ్రీనివాస…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *