డిజిటల్ సెన్సస్ 2027 కోసం సన్నాహాలు

తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌మీక్ష‌

హైద‌రాబాద్ : ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు తో పాటు సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ తెలంగాణ భారతి హోళికేరితో కలిసి రాబోయే సెన్సస్ ప్రక్రియకు సంబంధించిన విధి విధానాల గురించి జిల్లా కలెక్టర్లకు వివరించారు. మొదటి దశ – హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ – మే 11 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయని వెల్ల‌డించారు.

సెన్సస్ 2027 భారతదేశంలో మొట్ట మొదటి పూర్తి డిజిటల్ సెన్సస్, ఇది రియల్-టైమ్, ఖచ్చితమైన , పారదర్శక డేటా సంగ్రహణను నిర్ధారించే ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ ద్వారా నిర్వహించ బడుతుందని అన్నారు సీఎస్ రామ‌కృష్ణ రావు. HLO కి 15 రోజుల ముందు స్వీయ-గణన ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

మారుమూల, గిరిజన , దుర్బల ప్రాంతాలతో సహా – పూర్తి కవరేజీని నిర్ధారించాలని, గణనదారులు , పర్యవేక్షకులకు నిర్మాణాత్మక శిక్షణపై దృష్టి పెట్టాలని కలెక్టర్లను ఆదేశించారు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ప్రధాన కార్యదర్శులు రాహుల్ బొజ్జా, సందీప్ కుమార్ సుల్తానియా, ప్రియాంక, సీనియర్ అధికారులు హాజరయ్యారు.

  • Related Posts

    వ్య‌వ‌సాయ రంగానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

    చెన్నై : త‌మిళ‌నాడు స‌ర్కార్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇందులో భాగంగా సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ అధ్యక్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వరి, చెరకు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై ప్రధానంగా చర్చించ‌నున్నారు. ఇవాళ జోసెఫ్…

    రైతుల‌కు రూ. 300 కోట్ల వార్షిక బ‌కాయిల చెల్లింపు

    అమ‌రావ‌తి : ఏపీ పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీఎం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సీఆర్డీఏ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలిపారు. పలు ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపార‌న్నారు. ఆలస్యం కారణంగా గృహ కొనుగోలుదారులు అదనపు ఆర్థిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *