వైభవంగా కుమార ధార తీర్థ ముక్కోటి

Spread the love

ప‌రిమిత సంఖ్య‌లో భ‌క్తుల‌కు అనుమ‌తి

తిరుమల : తిరుమలలో కుమార ధార తీర్థ ముక్కోటి వైభవంగా నిర్వహించారు. చంద్ర గ్రహణం కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులను తీర్థానికి అనుమతించారు. శ్రీవారి సేవకుల సహకారంతో టీటీడీ అన్న ప్రసాద విభాగం సిబ్బంది పాప వినాశనం డ్యామ్ వద్ద భక్తులకు అల్పాహారం, పాలు, మంచినీరు పంచిపెట్టారు. వివిధ విభాగాల అధికారులు ఏర్పాట్లను పర్యావేక్షించారు. అంత‌కు ముందు చంద్ర గ్ర‌హ‌ణం కార‌ణంగా ప్ర‌ధాన ఆల‌యాన్ని మూసి వేశారు.

అనంత‌రం ఆల‌యాన్ని శుద్ది చేశారు. ఆల‌య ఉన్న‌తాధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ప్ర‌ధాన పూజారులు శ్రీ‌వారి గుడిని తెరిచారు. ఈ సంద‌ర్బంగా ఆల‌య ఆన‌వాయితీ ప్ర‌కారం శుద్ది చేశారు. ఆ క‌లియుగ దైవం అయిన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామికి ఘ‌నంగా పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం స్వామి వారి ద‌ర్శ‌నం కోసం వేచి ఉన్న భ‌క్తుల‌కు ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించారు. ఇదిలా ఉండ‌గా కొత్త‌గా ఈవోగా కొలువు తీరిన ర‌విచంద్ర ఫుల్ ఫోక‌స్ పెట్టారు తిరుమ‌ల ఆల‌య నిర్వ‌హ‌ణ‌పై. ఏ ఒక్క భ‌క్తుడికి ఇబ్బంది లేకుండా స‌క‌ల సౌక‌ర్య‌లు క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపారు.

  • Related Posts

    ఉత్సాహంగా మహిళా ఉద్యోగుల పోటీలు

    Spread the love

    Spread the loveఉద్యోగుల సంక్షేమ విభాగం ఆధ్వ‌ర్యంలో తిరుపతి : టీటీడీ ఆధ్వ‌ర్యంలో మార్చి 9న నిర్వ‌హించ‌నున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని టీటీడీ ఉద్యోగుల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా…

    శ్రీ‌వారి ఆల‌యంలో ద‌ర్శ‌నం ప్రారంభం

    Spread the love

    Spread the loveముగిసిన చంద్ర గ్ర‌హ‌ణం భ‌క్తులు క్యూ తిరుమల : శ్రీ‌వారి ఆల‌యంలో రాత్రి 8 గంట‌ల నుండి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ప్రారంభ‌మైంది. మధ్యాహ్నం 3.26 నుండి సాయంత్రం 6.47 గంట‌ల వ‌ర‌కు చంద్ర గ్రహణం ఉన్న కారణంగా ముందుగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *