ఉత్సాహంగా మహిళా ఉద్యోగుల పోటీలు

Spread the love

ఉద్యోగుల సంక్షేమ విభాగం ఆధ్వ‌ర్యంలో

తిరుపతి : టీటీడీ ఆధ్వ‌ర్యంలో మార్చి 9న నిర్వ‌హించ‌నున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని టీటీడీ ఉద్యోగుల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా ఎస్వీ ఓరియంటల్ కళాశాలలో వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. చిత్రలేఖనం పోటీలలో పీఆర్వో (ఎఫ్ఏసి) కుమారి పి.నీలిమ ప్ర‌థ‌మ‌, శ‌శిక‌ళ ద్వితీయ‌, కుమారి ఇంద్ర‌జ తృతీయ స్థాన‌లో నిలిచారు. అదేవిధంగా వ్యాసరచన పోటీల‌లో శ్రీ‌ల‌త ప్ర‌థ‌మ‌, అలేఖ్య ద్వితీయ‌, శ్రీ‌ల‌క్ష్మీ తృతీయ స్థాన‌లో నిలిచారు.

ఇదిలా ఉండ‌గా పోటీల‌లో భాగంగా మార్చి 4వ తేదీ బుధ‌వారం మధ్యాహ్నం 3 గంటలకు ఎస్వీ ఓరియంటల్ కళాశాలలో క్విజ్ పోటీలు నిర్వహించారు. మార్చి 5వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాలలో సంగీతంలో పోటీలు నిర్వహించ‌నున్న‌ట్లు తెలిపారు. టిటిడి డిప్యూటీ ఈవో (సంక్షేమం) ఆనంద‌రాజు ఈ పోటీలను పర్యవేక్షిస్తున్నారు.

  • Related Posts

    వైభవంగా కుమార ధార తీర్థ ముక్కోటి

    Spread the love

    Spread the loveప‌రిమిత సంఖ్య‌లో భ‌క్తుల‌కు అనుమ‌తి తిరుమల : తిరుమలలో కుమార ధార తీర్థ ముక్కోటి వైభవంగా నిర్వహించారు. చంద్ర గ్రహణం కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులను తీర్థానికి అనుమతించారు. శ్రీవారి సేవకుల సహకారంతో టీటీడీ అన్న ప్రసాద విభాగం…

    శ్రీ‌వారి ఆల‌యంలో ద‌ర్శ‌నం ప్రారంభం

    Spread the love

    Spread the loveముగిసిన చంద్ర గ్ర‌హ‌ణం భ‌క్తులు క్యూ తిరుమల : శ్రీ‌వారి ఆల‌యంలో రాత్రి 8 గంట‌ల నుండి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ప్రారంభ‌మైంది. మధ్యాహ్నం 3.26 నుండి సాయంత్రం 6.47 గంట‌ల వ‌ర‌కు చంద్ర గ్రహణం ఉన్న కారణంగా ముందుగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *