రికార్డుల కంటే నాకు దేశం ముఖ్యం : సంజు శాంస‌న్

తిరువ‌నంత‌పురంకు చేరుకున్న స్టార్ క్రికెట‌ర్

కేర‌ళ : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో అసాధార‌ణ‌మైన ఆట‌తీరుతో ఆక‌ట్టుకున్నాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్. త‌న స్వ‌స్థ‌లం తిరువ‌నంత‌పురం. టోర్నీలో త‌ను 321 ప‌రుగులు చేసి ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీగా ఎంపిక‌య్యాడు. అహ్మ‌దాబాద్ నుంచి నేరుగా తిరువ‌నంత‌పురంకు చేరుకున్నాడు సంజు శాంస‌న్ భారీ భ‌ద్ర‌త మ‌ధ్య‌. వేలాది మంది త‌న‌ను చూసేందుకు త‌ర‌లి వ‌చ్చారు అభిమానులు. ఇదే సంద‌ర్బంగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శాంస‌న్ కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. బొకే ఇచ్చి స‌త్క‌రించారు. ఈ సంద‌ర్బంగా సంజు శాంస‌న్ మీడియాతో మాట్లాడాడు. ఇది ఒక కల లాంటిది. ఈ కలను కనడానికి నాకు ధైర్యం ఉంది

నా దేశం కోసం దాన్ని గెలవాలని నేను కోరుకుంటున్నాను. అది ఇప్పుడు ఉన్న విధంగా మారే విధంగా నేను సహకరించాలని అనుకుంటున్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. కోట్లాది మంది న‌న్ను ఆశీర్వ‌దించారు. బాగా ఆడాల‌ని దీవించారు. మ‌రికొంద‌రు ప్రార్థ‌న‌లు కూడా చేశారు. వారంద‌రికీ నేను ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్నాను. నా చిన్ననాటి రోజుల నుండి పరిస్థితులను సానుకూలంగా చూడటానికి నేను శిక్షణ పొందాను. సాధారణంగా అన్ని బాధలు, అన్ని ఎదురు దెబ్బలు నన్ను చాలా బలవంతుడిని చేశాయని నేను భావిస్తున్నాను అని పేర్కొన్నాడు.

జీవితంలో, నా కెరీర్‌లో అన్ని బాధలు, ఎదురు దెబ్బలు, నిరాశలను సానుకూలంగా ఉపయోగించినట్లయితే, మీ జీవితంలో గొప్ప బలం కాగలదని నేను భావిస్తున్నాను అని స్ప‌ష్టం చేశాడు సంజు శాంస‌న్.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *