భారత క్రికెట్ లో కలకలం రేపిన మాజీ క్రికెటర్
ముంబై : మాజీ క్రికెట్ జట్టు సెలెక్టర్ సందీప్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా భారత క్రికెట్లో అత్యంత వివాదాస్పదమైన కొన్ని నిర్ణయాలపై పాటిల్ చాలా సంవత్సరాలుగా మౌనం వీడారు.
మహేంద్ర సింగ్ ధోని ఒక్కసారి కూడా ‘యువరాజ్ సింగ్ను డ్రాప్ చేయమని’ చెప్పలేదని అన్నాడు. సమావేశాల్లో కాదు, పర్యటనలో కాదు, మ్యాచ్ల సమయంలో కాదు. నేను దీన్ని రికార్డులో ఉంచుతున్నానని తెలిపారు. నాగ్పూర్ టెస్ట్ ఓటమి తర్వాత సచిన్ టెండూల్కర్తో 2012లో జరిగిన ఉద్రిక్త సమావేశాన్ని కూడా ఆయన వెల్లడించారు.
అక్కడ భారతదేశం పరివర్తన కోసం చూస్తున్నప్పుడు సెలెక్టర్లు అతని భవిష్యత్తు ప్రణాళికల గురించి అడిగారని స్పష్టం చేశారు. శిఖర్ ధావన్ జట్టులోకి వచ్చినప్పుడు గంభీర్ను డ్రాప్ చేసినప్పటి నుండి అతనితో మాట్లాడటానికి నిరాకరించినప్పటికీ, తాను ఇప్పటికీ గౌతమ్ గంభీర్ను గౌరవిస్తానని సందీప్ పాటిల్ చెప్పారు. ఇదిలా ఉండగా తాజాగా భారత జట్టు మాజీ సెలక్టర్ సందీప్ పాటిల్ తాజాగా చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. క్రికెట్ వర్గాలలో చర్చకు దారి తీసేలా చేశాయి.







