ప్రశంసలు కురిపించిన సంజు శాంసన్
న్యూఢిల్లీ : కేరళ స్టార్ క్రికెటర్, టీ20 వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు గ్రహీత సంజు శాంసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తను యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ గురించి ఆసక్తికర అంశాన్ని పంచుకున్నాడు.
నమన్’ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాజస్థాన్ రాయల్స్ తరపున తన IPL అరంగేట్రం చేసినప్పుడు తన మనస్తత్వం ఎలా ఉండేదో వైభవ్ సూర్యవంశీని అడిగారు శాంసన్ ను. తను ఇలా పంచుకున్నాడు. వైభవ్ తన ఆలోచనా విధానాన్ని వివరించడం మొదలుపెట్టి ఇలా అన్నాడు. “నన్ను దూకుడుగా ఆడమని చెబితే, నేను దూకుడుగానే ఆడతాను.”
ఆ సమయంలో, సంజు శాంసన్ మధ్యలో కల్పించుకుని ఇలా అన్నాడు. “క్షమించండి, నేను మధ్యలో మాట్లాడవచ్చా? ఆ సమావేశంలో నేను కూడా ఉన్నాను, కాబట్టి అసలు కథ ఏమిటో నేను చెబుతాను.”
ఆ తర్వాత సంజు వివరిస్తూ రాహుల్ ద్రవిడ్ తనను పిలిచి ఇలా అన్నారని చెప్పాడు. “మనం ఈ యువకుడితో మాట్లాడాలి. బ్యాటింగ్ విషయంలో అతను ఎలా వ్యవహరించాలో మనం అతనికి మార్గనిర్దేశం చేయాలి. ఆ చర్చ జరుగుతున్నప్పుడు, రాహుల్ ద్రవిడ్ వైభవ్ను ఇలా అడిగాడు . బ్యాటింగ్ కోసం నీ ప్రణాళిక ఏమిటి అని.
వైభవ్ చాలా సాధారణంగా ఇలా బదులిచ్చాడని సంజు చెప్పాడు. ఏమీ ప్రత్యేకంగా లేదు సార్. నేను కేవలం మైదానంలోకి వెళ్లి ఆడతాను అంతే అని . నాకు మొదటి బంతి ఎదురైతే, నేను ఆ మొదటి బంతినే బాదేస్తాను. మైదానంలో అతను చేసింది కూడా సరిగ్గా అదే.






