బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కామెంట్స్
హైదరాబాద్ : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పుట్టిన రోజు సందర్బంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు.తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తన ప్లాన్ ఉంటుందన్నారు. అవమానాలు, అణిచివేతల నుంచే పెను మార్పులు వస్తాయని చెప్పారు ఎంపీ.
పదవుల కోసం పెదవులు మూసే రకం తాను కాదని సంచలన ప్రకటన చేశారు ఈటల రాజేందర్. మీ ఆశీర్వాదాలు వృథా కాకుండా చేస్తాననని పేర్కొన్నారు.
తాను రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలోనే ప్రజల కోసం పని చేస్తూ వచ్చానని అన్నారు. తన జీవితం ఉన్నంత వరకు జనంలోనే ఉంటానని స్పష్టం చేశారు ఈటల రాజేందర్. ఆ రోజుల్లో నాతో ఎవరైనా పెట్టుకోవాలంటే భయపెడేవాళ్లని అన్నారు. ప్రతి దానికి ఒక పరిష్కారం ఉంటుందన్నారు. తాను ఎవరి పట్ల ద్వేష పూరితంగా ఉండనని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందారు. అన్ని వర్గాల ప్రజలక్ష సంక్షేమం కోసం తాను పాటు పడతానని పేర్కొన్నారు.





