అంగ‌రంగ వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం

Spread the love

శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో

తిరుపతి : తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో రాత్రి శ్రీరామ పట్టాభిషేకం అంగ‌రంగ వైభవంగా జరిగింది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ఉత్సవ మూర్తులను ఊంజల్‌ మండపానికి వేంచేపు చేశారు. అనంతరం నరసింహ తీర్థం నుండి తెచ్చిన తీర్థంతో శ్రీకోదండ రామునికి అభిషేకం చేశారు. ఉదయం 9 నుండి 11 గంటల వరకు యాగశాలలో అగ్నిప్రతిష్ట, చతుర్దశ కలశస్నపన తిరుమంజనం నిర్వహించారు.

రాత్రి 7 గంటల నుండి శ్రీరామ పట్టాభిషేకం వైభవంగా జరిగింది. రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామ లక్ష్మణులు, ప్రత్యేక తిరుచ్చిపై శ్రీఆంజనేయ స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనం ఇచ్చారు భ‌క్త బాంధ‌వుల‌కు. ఇదిలా ఉండ‌గా క‌ళ్యాణోత్స‌వం సంద‌ర్బంగా టీటీడీ ఆద్వ‌ర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్‌, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెప్పపై శ్రీరామచంద్ర మూర్తి కటాక్షం

    Spread the love

    Spread the loveభ‌క్తుల‌కు అభ‌యం ఇచ్చిన స్వామి వారు తిరుపతి : తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి తెప్పోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా రెండో రోజు రాత్రి శ్రీ రామచంద్ర పుష్కరిణిలో స్వామివారు ఏడు చుట్లు తిరిగి భక్తులకు…

    తిరుమల శ్రీవారి స‌న్నిధిలో ఏపీ గ‌వ‌ర్న‌ర్

    Spread the love

    Spread the loveకుటుంబ స‌మేతంగా ద‌ర్శించుకున్నారు తిరుమల : తిరుమల శ్రీవారిని ఏపీ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్ కు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *