బాస‌ర ఆల‌యంలో సీఎం పూజ‌లు

Spread the love

మ‌న‌వ‌డికి అక్ష‌ర అభ్యాసం

నిర్మ‌ల్ జిల్లా : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా సోమ‌వారం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆల‌య క‌మిటీ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. ఇక్క‌డికి ప్ర‌తి నిత్యం అక్ష‌ర అభ్యాసం చేయించేందుకు తండ్రులు పెద్ద ఎత్తున వ‌స్తుంటారు. ఇదిలా ఉండ‌గా దేవస్థానం పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేయడానికి ముందు శ్రీ స‌ర‌స్వ‌తి అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సీఎం. అనంతరం ముఖ్యమంత్రి గారికి వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఇదే సందర్భంగా ముఖ్యమంత్రి మనవడికి అక్షరాభ్యాసం చేయించారు.

ఈ సంద‌ర్బంగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బాస‌ర ఆల‌యాన్ని న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో పున‌ర్ నిర్మాణం చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపారు. ఆల‌యాన్ని స‌ర్వాంగ సుంద‌ర్బంగా తీర్చిదిద్దేందుకు ప్ర‌య‌త్నం చేస్తామ‌న్నారు. ఆల‌య అభివృద్ది ప‌నుల‌కు రూ. 225 కోట్ల నిధులు కేటాయించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు సీఎం. ప‌నులు వేగ‌వంతం చేయాల‌ని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశామ‌న్నారు. రాబోయే గోదావ‌రి పుష్క‌రాల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తామ‌న్నారు.

  • Related Posts

    శ్రీ కోదండ రామాలయంలో విశేష ఉత్సవాలు

    Spread the love

    Spread the loveఏప్రిల్ 23న ఆల‌యంలో పుష్ప యాగం నిర్వ‌హ‌ణ తిరుప‌తి : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ నెల‌లో తిరుప‌తిలోని ప్రసిద్ద ఆల‌యం శ్రీ కోదండ రామాలయంలో విశేష ఉత్సవాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు…

    ముగిసిన శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు

    Spread the love

    Spread the loveఅంగ‌రంగ వైభ‌వంగా స్వామి వారి ధ్వ‌జారోహ‌ణం ఒంటిమిట్ట / తిరుప‌తి జిల్లా : ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో వార్షిక బ్రహ్మోత్సవాలు జ‌రిగాయి. నిన్న‌ రాత్రి ధ్వజావరోహణంతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *