బాస‌ర ఆల‌యంలో సీఎం పూజ‌లు

Spread the love

మ‌న‌వ‌డికి అక్ష‌ర అభ్యాసం

నిర్మ‌ల్ జిల్లా : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా సోమ‌వారం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆల‌య క‌మిటీ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. ఇక్క‌డికి ప్ర‌తి నిత్యం అక్ష‌ర అభ్యాసం చేయించేందుకు తండ్రులు పెద్ద ఎత్తున వ‌స్తుంటారు. ఇదిలా ఉండ‌గా దేవస్థానం పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేయడానికి ముందు శ్రీ స‌ర‌స్వ‌తి అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సీఎం. అనంతరం ముఖ్యమంత్రి గారికి వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఇదే సందర్భంగా ముఖ్యమంత్రి మనవడికి అక్షరాభ్యాసం చేయించారు.

ఈ సంద‌ర్బంగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బాస‌ర ఆల‌యాన్ని న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో పున‌ర్ నిర్మాణం చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపారు. ఆల‌యాన్ని స‌ర్వాంగ సుంద‌ర్బంగా తీర్చిదిద్దేందుకు ప్ర‌య‌త్నం చేస్తామ‌న్నారు. ఆల‌య అభివృద్ది ప‌నుల‌కు రూ. 225 కోట్ల నిధులు కేటాయించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు సీఎం. ప‌నులు వేగ‌వంతం చేయాల‌ని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశామ‌న్నారు. రాబోయే గోదావ‌రి పుష్క‌రాల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తామ‌న్నారు.

  • Related Posts

    భ‌క్తుల‌తో కిట కిట లాడుతున్న కేదార్ నాథ్ యాత్ర

    Spread the love

    Spread the loveగంట‌ల త‌ర‌బ‌డి వాహ‌నాల్లోనే తిష్ట వేసిన భ‌క్తులు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ : చార్ ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తారు. బద్రీనాథ్.. కేదార్ నాథ్ ఆలయ మార్గాలు భ‌క్త బాంధ‌వుల‌తో కిటకిట లాడుతున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ తో దారిలోనే…

    హ‌తీరాంజీ మ‌ఠం కేసులో సుప్రీంకోర్టు కీల‌క తీర్పు

    Spread the love

    Spread the loveఅర్జున్ దాస్ కు మ‌ఠాధిప‌తి గా కొన‌సాగింపు తిరుప‌తి : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్తానం సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ప్ర‌ధానంగా తిరుప‌తిలోని హ‌తీరాంజీ మ‌ఠం కేసు ఇవాళ విచార‌ణ‌కు వ‌చ్చింది. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *