సీఎంతో జేసీ దివాక‌ర్ రెడ్డి క‌ర‌చాల‌నం

సోద‌రుడు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి కూడా

అనంత‌పురం జిల్లా : అనంత‌పురం జిల్లాలో అరుదైన స‌న్నివేశం చోటు చేసుకుంది. జ‌ల‌హార‌తి కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు వ‌చ్చారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఆయ‌న తాడిప‌త్రి వేదిక‌గా దీనిని ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన స‌భ‌లో పాల్గొన్నారు. అంత‌కు ముందు ఊహించ‌ని విధంగా త‌న చిర‌కాల ప్ర‌త్య‌ర్థి, స్నేహితుడైన రాష్ట్ర వ్యాప్తంగా పేరు పొందిన జేసీ దివాక‌ర్ రెడ్డితో పాటు ఆయ‌న సోద‌రుడు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి చంద్ర‌బాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఈ ఇద్ద‌రి మ‌ధ్య 40 సంవ‌త్స‌రాల అనుబంధం ఉంది. ఇద్ద‌రూ రాయ‌ల‌సీమ ప్రాంతానికి చెందిన సీనియ‌ర్ నాయ‌కులు. ఒక‌నాడు తెలుగుదేశం పార్టీలో కింగ్ పిన్ గా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చారు చంద్ర‌బాబు.

ఇదే క్ర‌మంలో దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డితో పాటు గ‌తంలో కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన స‌మ‌యంలో ముఖ్య భూమిక పోషించాడు జేసీ దివాక‌ర్ రెడ్డి. రాయ‌ల‌సీమ‌లో దివంగ‌త మంత్రి ప‌రిటాల ర‌వీంద్ర‌, జేసీ ఫ్యామిలీకి మ‌ధ్య విభేదాలు ఉండేవి. కానీ రాజ‌కీయాల‌లో శాశ్వ‌త మిత్రులు శ‌త్ర‌వులు ఉండ‌ర‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల‌తో జేసీ కుటుంబం అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంది. ప‌రిటాల ఫ్యామిలీని, జేసీ ఫ్యామిలీని ఒకేచోట చేర్చ‌డంలో చంద్రబాబు నాయుడు స‌క్సెస్ అయ్యారు. దీంతో ఇవాళ ఈ ఇద్ద‌రు నేత‌లు క‌లుసు కోవ‌డం, ఆనాటి రాజ‌కీయ ప‌ర‌మైన జ్ఞాప‌కాల‌ను పంచుకోవ‌డం సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారింది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *