నా ఇన్నింగ్స్ ను ధోనీకి అంకితం చేస్తున్నా

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ముకుల్ చౌద‌రి

కోల్ క‌తా : యంగ్ క్రికెట‌ర్ ముకుల్ చౌద‌రి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కోల్‌కతాపై ఆడిన వీరోచిత ఇన్నింగ్స్‌ను తన తండ్రికి, ఎంఎస్ ధోనీకి అంకితం ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కేవలం 27 బంతుల్లో 7 సిక్సర్లతో 54 పరుగులు చేసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. తన తండ్రి దలీప్ కుమార్ చౌదరి కన్న కలను నెరవేర్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే, ధోనీ ఫినిషింగ్ స్టైల్‌ను చూస్తూ పెరిగానని, ఆయన స్ఫూర్తితోనే ఈ మ్యాచ్‌ను ముగించ గలిగానని చెప్పాడు మ్యాచ్ ముగిసిన అనంత‌రం. ఇదిలా ఉండ‌గా ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో కీల‌క‌మైన పోరులో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ పై ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టు అద్బుత విజ‌యాన్ని సాధించింది.

ఇరు జ‌ట్ల మ‌ధ్య ఆస‌క్తిర పోరు కొన‌సాగింది ఇరు జ‌ట్ల మ‌ధ్య‌. ముందుగా బ్యాటింగ్ కు దిగింది కోల్ క‌తా జ‌ట్టు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 182 ర‌న్స్ ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. అనంత‌రం బ‌రిలోకి దిగింది ల‌క్నో సూప‌ర్ జెయింట్స్. ఒకానొక ద‌శ‌లో ఓట‌మి అంచున ఉన్న ల‌క్నోకు ఊహించ‌ని రీతిలో విజ‌యాన్ని చేకూర్చి పెట్టాడు ముకుల్ చౌద‌రి. ఒకదశలో 128/7తో ఉన్న ఎల్‌ఎస్‌జీని ముకుల్‌ చౌదరి 27 బంతుల్లో 54 నాటౌట్ గా నిలిచాడు. 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో అసాధారణంగా పోరాడి ఒంటిచేత్తో గెలిపించాడు. అయూశ్‌ బదోని 34 బంతులో 54 ప‌రుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు 2 సిక్స్ లు కొట్టాడు.

  • Related Posts

    వైభ‌వ్ సూర్య‌వంశీ ఎంపిక క‌రెక్టు కాదు

    హైద‌రాబాద్ : ప్ర‌ముఖ క్రికెట్ అనలిస్ట్, కామెంటేట‌ర్ హ‌ర్ష భోగ్లే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇంగ్లండ్ టూర్ లో భాగంగా శ్రేయ‌స్ అయ్య‌ర్ నాయ‌క‌త్వంలో టీమిండియా టి20 సీరీస్ ను కోల్పోయింది. ఆఖ‌రి మ్యాచ్ లోనూ చేతులెత్తేశారు. ప్ర‌ధాన ఆట‌గాళ్లు ఆశించిన…

    వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్ లో ఎంఎస్ ధోనీ ఆడ‌టం క‌ష్ట‌మే

    చెన్నై : భార‌త దేశ క్రికెట్ రంగంలో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ఏకైక క్రికెట‌ర్ జార్ఖండ్ డైన‌మెట్ మ‌హేంద్ర సింగ్ ధోనీ. త‌న సార‌థ్యంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ ప‌లుమార్లు ఐపీఎల్ టైటిళ్ల‌ను స్వంతం చేసుకుంది. ప‌లువురిని మార్చింది సీఎస్కే యాజ‌మాన్యం.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *