హాజరైన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం హైదరాబాద్ లో సీఎం ఎ .రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, ఎమ్మెల్యేలు ఎవరి మాట వినడం లేదని, మంత్రులు తలోదారి అన్నట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో మీనాక్షి సమా వేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్బంగా రాష్ట్రంలో, పార్టీలో ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై చర్చించినట్లు సమాచారం
ఎమ్మెల్యేల అసంతృప్తి.. బాహాటంగానే విమర్శలు ఆరోపణలు చేస్తున్న వైనం పై మీనాక్షి నటరాజన్ ఆరా తీసిందని, దీనికి సమాధానం చెప్పేందుకు ప్రయత్నం చేశారు సీఎం, టీపీసీసీ చీఫ్. ప్రత్యేకించి మంత్రులపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు లెక్కకు మించి వచ్చాయి. జగిత్యాల పరిణామాలు.. నామినేటెడ్ పదవులు.. మహిళా బిల్లు నియోజకవర్గాల పునర్విభజన తదితర అంశాలపై చర్చకు వచ్చాయి. అయితే ప్రధానంగా ఎమ్మెల్యేలు మంత్రుల వల్ల పభుత్వానికి పార్టీకి జరుగుతున్న డ్యామేజ్ పైనే ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం.





