సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి న‌ట‌రాజ‌న్ భేటీ

Spread the love

హాజ‌రైన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్ బుధ‌వారం హైద‌రాబాద్ లో సీఎం ఎ .రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ల‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పాల‌న గాడి త‌ప్పింద‌ని, ఎమ్మెల్యేలు ఎవ‌రి మాట విన‌డం లేద‌ని, మంత్రులు త‌లోదారి అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ త‌రుణంలో మీనాక్షి స‌మా వేశం కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఈ సంద‌ర్బంగా రాష్ట్రంలో, పార్టీలో ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై చర్చించిన‌ట్లు స‌మాచారం

ఎమ్మెల్యేల అసంతృప్తి.. బాహాటంగానే విమర్శలు ఆరోపణలు చేస్తున్న వైనం పై మీనాక్షి న‌ట‌రాజ‌న్ ఆరా తీసింద‌ని, దీనికి స‌మాధానం చెప్పేందుకు ప్ర‌య‌త్నం చేశారు సీఎం, టీపీసీసీ చీఫ్‌. ప్ర‌త్యేకించి మంత్రుల‌పై పెద్ద ఎత్తున అవినీతి ఆరోప‌ణ‌లు లెక్క‌కు మించి వ‌చ్చాయి. జగిత్యాల పరిణామాలు.. నామినేటెడ్ పదవులు.. మహిళా బిల్లు నియోజకవర్గాల పునర్విభజన తదితర అంశాలపై చర్చకు వ‌చ్చాయి. అయితే ప్రధానంగా ఎమ్మెల్యేలు మంత్రుల వల్ల పభుత్వానికి పార్టీకి జరుగుతున్న డ్యామేజ్ పైనే ఈ సమావేశంలో చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

  • Related Posts

    శ్రీమన్నారాయణ మహా యజ్ఞానికి జగన్‌కు ఆహ్వానం

    Spread the love

    Spread the loveఏప్రిల్ 19 నుంచి 29వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న య‌జ్ఞం అమ‌రావ‌తి : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డిని ఆయన నివాసంలో మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ…

    పేద‌ల ఆక‌లి తీరుస్తున్న అన్న క్యాంటీన్

    Spread the love

    Spread the loveప్రారంభించిన సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : అన్న క్యాంటీన్లు పేద‌ల ఆక‌లిని తీరుస్తున్నాయ‌ని అన్నారు సీఎం చంద్ర‌బాబు నాయుడు.పెదకూరపాడు నియోజకవర్గం ధరణికోటలో కార్మికులతో కలిసి అన్న క్యాంటీన్‌ను ప్రారంభించి ప్ర‌సంగించారు. అన్న క్యాంటీన్ ప్రారంభం అనంతరం పేదలకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *