పోలవరం నల్లమల సాగర్ లింక్ : సీఎం

Spread the love

సీడబ్ల్యూసీ నుంచి డీపీఆర్ కు పంపుతుంది

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. 200 టీఎంసీల గోదావరి వరద నీటిని బొల్లాపల్లి రిజర్వాయర్, నల్లమల సాగర్‌కు తరలించేందుకు రూ.58,700 కోట్లు ఖర్చు కానుందని అన్నారు. దీనికి సంబంధించి సీడబ్ల్యూసీ నుంచి డీపీఆర్ కు అక్టోబర్ 31 కల్లా ఆమోదం లభిస్తుందని అన్నారు. అటవీ, పర్యావరణ అనుమతులు ఆర్ అండ్ ఆర్ క్లియరెన్స్ సెప్టెంబర్ 30కి పూర్తి కానున్నాయని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. చింతలపూడి లిఫ్ట్‌కు పర్యావరణ అనుమతులు వచ్చాయని, ఈ ప్రాజెక్టుకు రూ.8,075 కోట్ల వ్యయం కానుందని అంచనాలను అధికారులు ముఖ్యమంత్రి ముందుంచారు.

ప్రాజెక్టు ప్రధాన కాలువ పనులు చేప్టటి, 2027 జూన్‌కు పూర్తి చేయాల్సి ఉండగా, దీనికి రూ.2,042 కోట్లు అవసరం కానున్నాయి. ప్రధాన కాలువకు అవసరమైన 910 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం రూ.152 కోట్లను కేటాయించింది. అటు వరికెపుడిశెల ఎత్తిపోతల పథకానికి రూ.3,278 కోట్లు ఖర్చు కానుందని, దీని ద్వారా 84,500 ఎకరాలకు సాగునీరు అందించవచ్చని ముఖ్యమంత్రికి తెలిపారు. తీగ లేరు కెనాల్ హెడ్ రెగ్యులేటర్ గేట్లు, ఈస్ట్రన్ మెయిన్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్, డైవర్సన్ రోడ్ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. మొత్తం వెలిగొండ పనులు జూన్ చివరి కల్లా పూర్తి చేయాలని లక్ష్యం కాగా, దీనికి రూ.2,042 కోట్లు వ్యయం కానుంది.

  • Related Posts

    శ్రీమన్నారాయణ మహా యజ్ఞానికి జగన్‌కు ఆహ్వానం

    Spread the love

    Spread the loveఏప్రిల్ 19 నుంచి 29వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న య‌జ్ఞం అమ‌రావ‌తి : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డిని ఆయన నివాసంలో మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ…

    పేద‌ల ఆక‌లి తీరుస్తున్న అన్న క్యాంటీన్

    Spread the love

    Spread the loveప్రారంభించిన సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : అన్న క్యాంటీన్లు పేద‌ల ఆక‌లిని తీరుస్తున్నాయ‌ని అన్నారు సీఎం చంద్ర‌బాబు నాయుడు.పెదకూరపాడు నియోజకవర్గం ధరణికోటలో కార్మికులతో కలిసి అన్న క్యాంటీన్‌ను ప్రారంభించి ప్ర‌సంగించారు. అన్న క్యాంటీన్ ప్రారంభం అనంతరం పేదలకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *