అమ‌రావ‌తి రైతుల‌కు అన్యాయ జ‌ర‌గ‌దు

స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తి రైతుల‌కు సంబంధించి భ‌రోసా ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. స్వ‌చ్చంధంగా త‌మ భూముల‌ను ఇచ్చిన వారికి మేలు జ‌రిగేలా చూస్తామ‌న్నారు. అమ‌రావ‌తి రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు అన్యాయం జరగనివ్వను అని ప్ర‌క‌టించారు. రెండో విడత భూ సమీకరణ రైతులకు అండగా నిలిచారు సీఎం.

ఏడాదికి ఇచ్చే కౌలు రూ.30,000 నుండి రూ.40,000కు పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అన్న‌దాత‌ల‌కు తీపి క‌బురు చెప్పారు. ఏ ఒక్క‌రికీ ఇబ్బంది లేకుండా చేస్తామ‌న్నారు. ప్రతి ఏటా రూ.3,000 చొప్పున కౌలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామ‌న్నారు. రాబోయే 10 ఏళ్ల పాటు రైతులకు కౌలు చెల్లింపు జ‌రుగుతుంద‌ని చెప్పారు. రైతు కుటుంబానికి రూ.1.50 లక్షల వరకు వ్యవసాయ రుణమాఫీకి ఆమోదం తెలిపామ‌న్నారు సీఎం. ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణంలో భాగస్వాములైన రైతులకు ఎప్పటికీ అన్యాయం జరగనివ్వమని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *