రాష్ట్రాభివృద్దికి సింగ‌పూర్ సాంకేతిక సాయం

Spread the love

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన మంత్రి అచ్చెన్నాయుడు

సింగ‌పూర్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అభివృద్దికి సింగ‌పూర్ దేశం అనుస‌రిస్తున్న సాంకేతిక విజ్ఞానం ఉపయోగించుకునేలా ప్లాన్ చేస్తున్నామ‌న్నారు రాష్ట్ర వ్య‌వ‌సాయ‌, మత్స్య శాఖ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు. మంత్రి పొంగూరు నారాయ‌ణ‌తో క‌లిసి అచ్చెన్నాయుడు సింగ‌పూర్ లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా సింగపూర్‌లో నిర్వహిస్తున్న వారం రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి గన్ సియో హువాంగ్‌తో సమావేశం అయ్యారు.

భారత్ – సింగపూర్ మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహ సంబంధాలు, ఆర్థిక భాగస్వామ్యంపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా మౌలిక వసతుల కల్పన, స్మార్ట్ సిటీస్, అర్బన్ ప్లానింగ్, పునరుత్పాదక శక్తి, టెక్నాలజీ రంగాల్లో సింగపూర్ నైపుణ్యాన్ని మన రాష్ట్ర అభివృద్ధికి ఎలా వినియోగించు కోవాలనే అంశాలపై సానుకూల చర్చలు జరిగాయని వెల్ల‌డించారు మంత్రి అచ్చెన్నాయుడు. సీఎం చంద్ర‌బాబు నాయుడు నాయ‌క‌త్వంలో అంతర్జాతీయ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అగ్రపథాన నిలిపేందుకు కృషి చేస్తున్నాం అన్నారు.

  • Related Posts

    స‌మ్మె విర‌మించండి విధుల‌కు హాజ‌రుకండి

    Spread the love

    Spread the loveపిలుపునిచ్చిన ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి హైద‌రాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం అత్యంత సానుకూలంగా స్పందించిందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి) వై. నాగిరెడ్డి తెలిపారు. కార్మికుల డిమాండ్లపై సమగ్రంగా చర్చించేందుకు స‌ర్కార్ ఇప్పటికే…

    వైసీపీ మనుగడ మొత్తం విధ్వంస‌మే

    Spread the love

    Spread the loveనిప్పులు చెరిగిన మాజీ మంత్రి పార్థ‌సార‌థి అమ‌రావ‌తి : వైసీపీ పాల‌నా కాలంలో మొత్తం విధ్వంసం త‌ప్ప జ‌రిగింది ఏముంద‌ని ప్ర‌శ్నించారు మాజీ మంత్రి కొలుసు పార్థ‌సార‌థి. నాడు వివేకా నేడు దస్తగిరి వైసీపీ ‘రక్త చరిత్ర’ కాదా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *