ప్రోటోకాల్ వివాదం చంద్ర‌బాబు ఆగ్ర‌హం

Spread the love

మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ తీరుపై సీఎం సీరియ‌స్

అమ‌రావ‌తి : రాష్ట్రంలో కూట‌మి నేత‌ల మ‌ధ్య ప్రోటోకాల్, ఆధిప‌త్య పోరు కొన‌సాగుతూనే ఉంది. ఆయా పార్టీల అధినేత‌లు స‌ర్ది చెప్పేందుకు ప్ర‌య‌త్నం చేసినా అక్క‌డ‌క్క‌డా వివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా పిఠాపురం శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన అధికారిక కార్య‌క్ర‌మంలో ప్రోటోకాల్ వివాదం తారాస్థాయికి చేరింది. టీడీపీ, జ‌న‌సేన పార్టీల నేత‌లు వాగ్వావాదానికి దిగారు. ఈ ర‌గ‌డ రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. దీనిపై తీవ్రంగా స్పందించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆ వెంట‌నే ఆయ‌న తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్య‌క్షుడు, ఎమ్మ‌ల్యే ప‌ల్లా శ్రీ‌నివాస‌రావుతో ఫోన్ లో మాట్లాడారు.

అస‌లు ఏం చేస్తున్నారంటూ ప్ర‌శ్నించారు. ప్రోటోకాల్ వివాదం ఎందుకు చోటు చేసుకుంద‌ని ప్ర‌శ్నించారు.
పిఠాపురం ప్రోటోకాల్ వివాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్బంగా మాజీ ఎమ్మెల్యే వర్మ తీరును తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు . త‌ను వ్య‌వ‌హ‌రించిన తీరు దారుణంగా ఉంద‌ని అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఐక్యంగా ఉండాల్సిన నేతలు ప్రోటోకాల్ పేరుతో ఘర్షణ పడటం సరికాద‌న్నారు. ఎవ‌రి హ‌ద్దుల్లో వారు ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. ఇలాంటి వివాదాలు ప్ర‌జ‌ల్లో త‌ప్పుడు సంకేతాలు వెళ్లేలా చేస్తాయ‌న్నారు.

  • Related Posts

    టువాస్ పోర్టును సంద‌ర్శించిన మంత్రులు

    Spread the love

    Spread the loveసింగ‌పూర్ లో కొన‌సాగుతున్న అధికారిక ప‌ర్య‌ట‌న సింగ‌పూర్ : ఏపీకి చెందిన మంత్రులు సింగ‌పూర్ లో ప‌ర్య‌టిస్తున్నారు . ఈ ప‌ర్య‌ట‌న‌లో రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడి, అన‌గాని స‌త్య ప్ర‌సాద్, కింజారపు అచ్చెన్నాయుడు, పొంగూరు…

    జూన్ 8వ తేదీ లోపు ప‌నులు పూర్తి చేయాలి

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి హైద‌రాబాద్ : వ‌చ్చే జూన్ 8వ తేదీ లోపు ప‌నుల‌న్నీ పూర్తి చేయాల‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. డాక్టర్ బి.ఆర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *