3 కోట్ల మందికి అమ్మ‌ను అవుతా : క‌ల్వ‌కుంట్ల క‌విత

Spread the love

తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పార్టీ ప్ర‌క‌ట‌న

హైద‌రాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ (టీజేఎస్) అధ్య‌క్షురాలు, మాజీ శాస‌న మండ‌లి స‌భ్యురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. శ‌నివారం తాను కొత్త పార్టీ పెడుతున్న‌ట్లు వెల్ల‌డించారు. భారీ జ‌నం మ‌ధ్య ఆమె ఈ కీల‌క ప్ర‌క‌ట‌న వెల్ల‌డించారు. తెలంగాణ రాజ‌కీయాల‌లో ఆమె చేసిన తాజా ప్ర‌క‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది. ఒక మ‌హిళ రాజ‌కీయ పార్టీని స్థాపించ‌డం ఇదే తొలిసారి కావ‌డం విశేషం. ఆమె బ‌తుక‌మ్మ పండుగ‌కు శాశ్వ‌త గుర్తింపు తీసుకు వ‌చ్చేలా చేశారు.

హైదరాబాద్‌లో కవిత ‘తెలంగాణ రాష్ట్ర సేన’ను ప్రారంభించారు. భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు హాజరైన ఒక బహిరంగ సభలో ఈ ప్రకటన వెలువడింది. సభికులను ఉద్దేశించి ప్రసంగించడానికి ముందు, ఆమె సభా ప్రాంగణంలో తెలంగాణ అమరులకు, తెలంగాణ తల్లికి , ప్రొఫెసర్ జయశంకర్‌కు నివాళులర్పించారు.
కవిత అధికారికంగా పార్టీని ఆవిష్కరించడంతో, ఈ కార్యక్రమం తెలంగాణ రాజకీయాల్లో ఒక నూతన పరిణామానికి నాంది పలికింది. ఇదే స‌మ‌యంలో త‌న తండ్రి స్తాపించిన బీఆర్ఎస్ పార్టీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీఆర్ఎస్ లో తెలంగాణ ఆత్మ కోల్పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

  • Related Posts

    క‌విత టీఆర్ఎస్ పార్టీపై బీఆర్ఎస్ కామెంట్స్

    Spread the love

    Spread the loveఅస‌లు పార్టీ త‌మ‌దే… త‌న పార్టీని న‌మ్మ‌రు హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ పేరును బార‌త రాష్ట్ర స‌మితి పార్టీగా మార్చిన కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు స్వంత కూతురు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. శ‌నివారం…

    సింగ‌పూర్ పాల‌నా విధానం అద్భుతం

    Spread the love

    Spread the loveకీల‌క ప్ర‌క‌ట‌న చేసిన వంగ‌ల‌పూడి అనిత సింగ‌పూర్ : ఏపీకి చెందిన మంత్రులు వంగ‌ల‌పూడి అనిత‌, స‌త్య‌కుమార్ యాద‌వ్, కింజార‌పున అచ్చెన్నాయుడు, అన‌గాని స‌త్య ప్ర‌సాద్, బీసీ జ‌నార్ద‌న్ రెడ్డిలు సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. సింగ‌పూర్ పాల‌నా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *