బీజేపీకి అన్నాడీఎంకే క‌టీఫ్‌ టీవీకేకు స‌పోర్ట్

Spread the love

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన కీల‌క నేత ష‌ణ్ముగం

చెన్నై : త‌మిళ‌నాడులో రాష్ట్ర రాజ‌కీయాలు కీల‌కంగా మారాయి. నిన్న‌టి దాకా బ‌ద్ద శ‌త్రువుగా ఉన్న అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు ఒక్క‌టి కాబోతున్నాయంటూ జ‌రుగుతున్న ప్ర‌చారానికి తెర దించారు ఏఐడీఎంకే సీనియ‌ర్ నాయ‌కుడు ష‌ణ్ముగం. మంగ‌ళ‌వారం త‌మ నివాసానికి చేరుకున్నారు భారీ భ‌ద్ర‌త మ‌ధ్య సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఇదే స‌మ‌యంలో వీసీకే చీఫ్ తిరుమావ‌ళ్ల‌న్ ను క‌లిశారు. అంత‌కు ముందు మాజీ సీఎం ఎంకే స్టాలిన్, వైగో, ఐయఎంల్ నేత‌ల‌ను కూడా మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్బంగా ష‌ణ్ముగం మీడియాతో మాట్లాడారు. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

BJP-NDA కూటమికి గుడ్ బై చెబుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు అన్నాడీఎంకే తిరుగుబాటు నేత ష‌ణ్ముగం. త‌మ‌దే అస‌లైన పార్టీ అని పేర్కొన్నారు. కీలక ఎమ్మెల్యేలు.. విజయ్‌కు మద్దతు ప్రకటిస్తున్న‌ట్లు తెలిపారు. ఇకపై NDA కూటమితో మాకు ఎటువంటి సంబంధం లేదన్నారు. తాము ఆ కూటమి నుండి బయటకు వచ్చేశామన్నారు. అసలైన AIADMK మాదేనని అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పళనిస్వామి DMKతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. పళనిస్వామి చేసిన ప్రతిపాదనను తాము అంగీకరించ లేద‌న్నారు.. పళనిస్వామి మాకు వ్యతిరేకంగా వ్యవహరించారని మండిప‌డ్డారు .వరుస ఓటములకు పళనిస్వామే కారణం అని ఫైర్ అయ్యారు.

  • Related Posts

    పార్టీ క్యాడ‌ర్ కు బ్యాన‌ర్లు, ఫ్లెక్సీ బోర్డులు పెట్టొద్దు

    Spread the love

    Spread the loveస్ప‌ష్టమైన ఆదేశాలు జారీ చేసిన టీవీకే పార్టీ చెన్నై : త‌మిళనాడులో కొత్త‌గా కొలువు తీరింది టీవీకే పార్టీ. ఆ పార్టీకి చెందిన ప్ర‌ముఖ న‌టుడు, చీఫ్ ముఖ్య‌మంత్రిగా కొలువు తీరారు జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. ఆయ‌న సీటు…

    సీఎం జోసెఫ్ సంచ‌ల‌న నిర్ణ‌యం

    Spread the love

    Spread the loveస‌ల‌హాదారుడిగా రాధ‌న్ పండిట్ చెన్నై : త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. మంగ‌ళ‌వారం ఆయ‌న ప్ర‌ముఖ జ్యోతిష్కుడిగా పేరు పొందిన రాధ‌న్ పండిట్ ను ప్ర‌భుత్వ స‌ల‌హాదారుడిగా నియ‌మించారు. ఇక పండిట్ కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *