బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు

మెడిక‌వ‌ర్ ఆస్ప‌త్రిలో మెరుగైన చికిత్స

హైద‌రాబాద్ : కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ త‌ల్లి శ‌కుంత‌ల అనారోగ్యానికి గురైంది. ఆమె కు గుండె పోటు రావ‌డంతో హుటా హుటిన హైద‌రాబాద్ లోని మెడిక‌వ‌ర్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్రస్తుతం శకుంతల గచ్చిబౌలిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
బండి భాగీరథ’ కేసు సంబంధించి గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంతో శకుంతల తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.మెడికవర్ ఆసుపత్రి వైద్యులు శకుంతలకు అత్యవసర చికిత్స అందిస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇదిలా ఉండ‌గా బండి సంజ‌య్ కుమారుడు బండి సాయి భగీర‌థ్ పై పోక్సో కేసు న‌మోదైంది . దీంతో దేశ వ్యాప్తంగా ఈ కేసు సంచ‌ల‌నంగా మారింది. గ‌త కొన్ని రోజులుగా త‌ను పోలీసుల‌కు అందుబాటులో లేకుండా త‌ప్పించుకు తిరుగుతున్నాడు. ఈ కేసుకు సంబంధించి సీఎం ఎ. రేవంత్ రెడ్డి సిట్ ను ఏర్పాటు చేశారు. కూక‌ట్ ప‌ల్లి డీసీపీ రితిరాజ్ గైక్వాడ్ ను విచార‌ణ అధికారిగా నియమించారు. మ‌రో వైపు త‌న‌కు మ‌ధ్యంత‌ర బెయిల్ కావాల‌ని కోరుతూ భ‌గీర‌థ్ త‌ర‌పున లాయ‌ర్ నిరంజ‌న్ రెడ్డి పిటిష‌న్ దాఖ‌లు చేశారు. మోసం చేసిన వాడికి ఎలా మ‌ద్ద‌తు ఇస్తారంటూ జ‌నం మండి ప‌డుతున్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *