ఆర్ట్ ఆఫ్ లివింగ్ సేవ‌లు ప్ర‌శంస‌నీయం

శ్రీ ర‌విశంక‌ర్ గురూజీ పై సీఎం చంద్ర‌బాబు

బెంగ‌ళూరు : శ్రీ‌శ్రీ ర‌విశంక‌ర్ గురూజీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ అందిస్తున్న సేవ‌లు ప్ర‌శంస‌నీయ‌మ‌ని అన్నారు సీఎం చంద్ర‌బాబు నాయుడు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీలు రోజువారీ జీవితంలో చాలా ప్రభావాన్ని చూపిస్తున్నాయని అన్నారు. భౌగోళిక రాజకీయ పరిస్థితులు ప్రపంచ దేశాలను ప్రభావితం చేస్తున్నాయి. సామాన్య ప్రజల జీవితాలు కూడా తీవ్ర ఒడిదుడుకులకు లోను అవుతోందన్నారు. గ్యాస్, ఇంధనం లాంటి వనరుల మార్కెట్ లభ్యత ప్రజలను ఒత్తిడికి గురి చేస్తోంది. ఈ సమయంలో ఒత్తిడిని ఎదుర్కోని సమర్ధంగా జీవించాల్సిన అవశ్యకత ఉందన్నారు సీఎం.

ఇలాంటి సమయంలోనే ఆర్ట్ ఆఫ్ లివింగ్ లాంటి సంస్థలు మానవాళికి అత్యు్త్తమ సేవలు అందించాలని కోరారు సీఎం. ప్రధాని మోదీ లాంటి సమర్ధవంతమైన నేత దేశానికి నేతృత్వం వహిస్తున్నారని, ప్రపంచ వ్యాప్తంగా భారత్ అగ్రగామిగా మారుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. వేల ఏళ్ల క్రితం వరకూ మానవాళిని నడిపించిన నేల ఇది. ప్రపంచానికి శాంతి మార్గాన్ని చూపించిన దేశం మనది అని గుర్తు చేశారు. ఆధునిక జీవనంలో శాంతిని సాధించేలా శ్రీ రవిశంకర్ గురూజీ తన బోధనలతో ప్రభావితం చేశారన్నారు చంద్ర‌బాబు నాయుడు. సంస్కృతితో మిళితమైన ఆధునికత, విలువలతో కూడిన జీవనం లాంటి ఎన్నో అంశాల ద్వారా తన బోధనల్ని సాగిస్తున్నారని కొనియాడారు.

  • Related Posts

    శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భ‌ద్ర‌త

    తిరుపతి : తిరుమల రాబోయే శ్రీవారి బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా తిరుమల పోలీసులు, టీటీడీ విజిలెన్స్ విభాగం ఆధ్వ‌ర్యంలో తిరుమలలోని వీవీఐపీ గెస్ట్ హౌస్ నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్, సెక్యూరిటీ…

    శ్రీవారి ఆలయంలో స్నపన తిరుమంజనం

    తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా శాస్త్రోక్తంగా ప‌విత్ర సమర్పణ జరిగింది.ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తరువాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *