తెలుగు అకాడ‌మీకి పూర్వ వైభ‌వం తీసుకువ‌స్తా

నూత‌న చైర్మ‌న్ కూర‌పాటి వెంక‌ట్ నారాయ‌ణ

వ‌రంగ‌ల్ జిల్లా : తెలుగు అకాడ‌మీ నూత‌న చైర్మ‌న్ గా ఎంపికైన డాక్ట‌ర్ కూర‌పాటి వెంక‌ట్ నారాయ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అకాడ‌మీకి పూర్వ వైభ‌వం తీసుకు వ‌స్తాన‌ని చెప్పారు. త‌న‌ను ఘ‌నంగా స‌న్మానించారు వ‌రంగ‌ల్ లోని హ‌నుమ‌కొండ లోని త‌న నివాసంలో. వెంక‌ట్ నారాయ‌ణ త‌న జీవిత కాలంలో తెలంగాణ ఉద్య‌మానికి ఇతోధికంగా సేవ‌లు అందించారు. తెలంగాణ ఉద్యమ నిర్మాతగా గుర్తింపు పొందారు. అలుపెరుగని ఉద్యమకారుడిగా పేరొందారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక ఆధ్వర్యంలో ఉద్యమకారులు వారిని మర్యాద పూర్వకంగా కలుసుకుని శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సత్కరించారు.

అనంతరం వేదిక రాష్ట్ర చైర్మన్ గోధుమల కుమారస్వామి మాట్లాడారు. ఉద్యమ తొలి కాలం నుండి ప్రొఫెసర్ లు కొత్తపల్లి జయ శంకర్, బియ్యాల జనార్ధన్, గద్దర్, కాళోజీ నారాయణ రావు, భూపతి కృష్ణమూర్తి తో క‌లిసి తెలంగాణ రాష్ట్ర విముక్తి కోసం ఎంత‌గానో శ్ర‌మించార‌ని ప్ర‌శంస‌లు కురిపించారు. తెలంగాణ ఆకాంక్షల కోసం నిరంతరం శ్రమించిన వెంకట్ నారాయణకు తెలుగు అకాడమీ చైర్మన్ పదవి దక్కడం ఉద్యమకారులందరికీ గర్వ కారణమని పేర్కొన్నారు. ఈ సంద‌ర్బంగా త‌న‌కు చైర్మ‌న్ అప్ప‌గించిన స‌ర్కార్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు వెంక‌ట్ నారాయ‌ణ‌. తెలుగు అకాడ‌మీకి పూర్వ వైభ‌వం తీసుకు వ‌స్తాన‌ని చెప్పారు.

  • Related Posts

    ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ

    టెహ్రాన్ : ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , కిర్గిజ్‌స్థాన్, రష్యా, తజికిస్థాన్ అధ్యక్షులతో సహా పలువురు పాల్గొనే నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. కిర్గిజ్‌స్థాన్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్…

    వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం

    అమరావ‌తి : వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశార‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీఎంకు ధ‌న్య‌వాదాలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *