కేసు నమోదు చేశారని, ఇక వదిలేయండి
అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్నంతా పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ ఎనలిస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు వ్యవహారం. ఆయన జనసేన పార్టీ గురించి, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. చివరకు ఆయనపై కేసు కూడా నమోదు చేసేంత దాకా వెళ్లింది. అయితే నాగేశ్వర్ రావును అరెస్ట్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన పోలీసులు తెలంగాణకు రానున్నారని ప్రచారం జరిగింది. లా అండ్ ఆర్డర్ కు భంగం కలుగుతుందని ఖాకీలను నాగేశ్వర్ రావు ఇంటి ముందు మోహరించారు.
దీనిపై స్పందించారు ప్రొఫెసర్ నాగేశ్వర్. తనపై ఆన్ లైన్ వేదికగా లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు స్వయంగా డీజీపీ సీవీ ఆనంద్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు అంశంపై తీవ్రంగా స్పందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ . ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే తనపై కేసు నమోదు చేశారని, తనను అరెస్ట్ చేయాలంటూ వస్తున్న ఒత్తిడిని తాను అర్థం చేసుకోగలనని, తాను ఎలా చెబుతానంటూ తిరిగి ప్రశ్నించారు. అది జరిగి పోయిన వ్యవహారం, ఇక వదిలి వేయాలని కోరారు పవన్ కళ్యాణ్.





