త‌ర త‌రాల‌కు త‌ర‌గ‌ని స్పూర్తి ఎన్టీఆర్

ఆయ‌న‌కు ఘ‌నంగా నివాళులు

అమ‌రావ‌తి : తెలుగు జాతి ఉన్నంత వ‌ర‌కు దివంగ‌త , ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు బ‌తికే ఉంటాడ‌ని అన్నారు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. మే 28న ఎన్టీఆర్ జ‌యంతి. ఈ సంద‌ర్బంగా ఆయ‌నను స్మ‌రించుకున్నారు. ఘ‌నంగా నివాళులు అర్పించారు.ప్రపంచానికి తెలుగుజాతి ఖ్యాతిని చాటిచెప్పిన‌ విశ్వ విఖ్యాత న‌ట సార్వ‌భౌముడు నంద‌మూరి తార‌క రామారావు జ‌యంతి సంద‌ర్భంగా ఆ మ‌హ‌నీయుని సేవ‌లు స్మ‌రిస్తూ నివాళులు అర్పిస్తున్నానని పేర్కొన్నారు లోకేష్‌.

తెలుగుజాతి ఆత్మ‌గౌర‌వంగా తెలుగుదేశం పార్టీ ప‌తాకాన్ని ఎగుర వేశారని కొనియాడారు. అణ‌గారిన వ‌ర్గాల‌కు అండ‌గా ప‌సుపు జెండాని నిల‌బెట్టార‌ని అన్నారు. మ‌హిళా సాధికార‌త‌కు బాట‌లు వేశారు. ప్ర‌జ‌ల కోసం..ప్ర‌గ‌తి కోసం తెలుగుదేశం పార్టీని అంకితం చేశారు. సంక్షేమానికి చిరునామా అయ్యారు. అన్నా అంటే నేనున్నానంటూ ఆదుకున్నారు. కోట్లాది హృద‌యాల్లో కొలువైన మ‌ర‌ణంలేని మ‌హా మ‌నిషి ఎన్టీఆర్‌కు జోహార్లు. తాతా..మీరే తెలుగు ప్ర‌జ‌ల కీర్తి..మీరే మాకు నిత్య‌నూత‌న స్ఫూర్తి అని పేర్కొన్నారు నారా లోకేష్‌.

  • Related Posts

    నా కొడుకు డ్రగ్స్ తీసుకోలేదు : ఎమ్మెల్సీ వెంక‌ట్రాం రెడ్డి

    హైద‌రాబాద్ : భార‌త రాష్ట్ర స‌మితి పార్టీకి చెందిన శాస‌న మండ‌లి స‌భ్యుడు (ఎమ్మెల్సీ) వెంక‌ట్రాం రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌న కొడుకు భ‌ర‌త్ రాజ్ రెడ్డి గురించి అవాస్త‌వాలు ప్ర‌చారం చేస్తున్నార‌ని, ఎలాంటి…

    కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం

    న్యూఢిల్లీ : సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ అధ్య‌క్ష‌త‌న గురువారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం న్యూఢిల్లీలో ఏఐసీసీ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *