త‌ర త‌రాల‌కు త‌ర‌గ‌ని స్పూర్తి ఎన్టీఆర్

ఆయ‌న‌కు ఘ‌నంగా నివాళులు

అమ‌రావ‌తి : తెలుగు జాతి ఉన్నంత వ‌ర‌కు దివంగ‌త , ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు బ‌తికే ఉంటాడ‌ని అన్నారు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. మే 28న ఎన్టీఆర్ జ‌యంతి. ఈ సంద‌ర్బంగా ఆయ‌నను స్మ‌రించుకున్నారు. ఘ‌నంగా నివాళులు అర్పించారు.ప్రపంచానికి తెలుగుజాతి ఖ్యాతిని చాటిచెప్పిన‌ విశ్వ విఖ్యాత న‌ట సార్వ‌భౌముడు నంద‌మూరి తార‌క రామారావు జ‌యంతి సంద‌ర్భంగా ఆ మ‌హ‌నీయుని సేవ‌లు స్మ‌రిస్తూ నివాళులు అర్పిస్తున్నానని పేర్కొన్నారు లోకేష్‌.

తెలుగుజాతి ఆత్మ‌గౌర‌వంగా తెలుగుదేశం పార్టీ ప‌తాకాన్ని ఎగుర వేశారని కొనియాడారు. అణ‌గారిన వ‌ర్గాల‌కు అండ‌గా ప‌సుపు జెండాని నిల‌బెట్టార‌ని అన్నారు. మ‌హిళా సాధికార‌త‌కు బాట‌లు వేశారు. ప్ర‌జ‌ల కోసం..ప్ర‌గ‌తి కోసం తెలుగుదేశం పార్టీని అంకితం చేశారు. సంక్షేమానికి చిరునామా అయ్యారు. అన్నా అంటే నేనున్నానంటూ ఆదుకున్నారు. కోట్లాది హృద‌యాల్లో కొలువైన మ‌ర‌ణంలేని మ‌హా మ‌నిషి ఎన్టీఆర్‌కు జోహార్లు. తాతా..మీరే తెలుగు ప్ర‌జ‌ల కీర్తి..మీరే మాకు నిత్య‌నూత‌న స్ఫూర్తి అని పేర్కొన్నారు నారా లోకేష్‌.

  • Related Posts

    ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ

    టెహ్రాన్ : ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , కిర్గిజ్‌స్థాన్, రష్యా, తజికిస్థాన్ అధ్యక్షులతో సహా పలువురు పాల్గొనే నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. కిర్గిజ్‌స్థాన్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్…

    వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం

    అమరావ‌తి : వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశార‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీఎంకు ధ‌న్య‌వాదాలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *