సూక్ష్మసేద్యం అమలులో ఏపీ నెంబ‌ర్ వ‌న్

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన వ్య‌వ‌సాయ శాఖ మంత్రి

అమ‌రావ‌తి : సూక్ష్మసేద్యం అమలులో ఏపీ నెంబ‌ర్ వ‌న్ అని పేర్కొన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 5.5 లక్షల ఎకరాలను కొత్తగా సూక్ష్మసేద్య పరిధిలోకి తీసుకువచ్చామని మంత్రి పేర్కొన్నారు. రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి, గిట్టుబాటు ధరలు, నష్టపరిహారం, విద్యుత్, సాగునీరు, మార్కెటింగ్ సదుపాయాలు వంటి అన్ని అంశాల్లో ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అసత్య ప్రచారాలను నమ్మకుండా రైతులు వాస్తవాలను గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఖరీఫ్ సాగుకు అవసరమైన ఎరువుల కొరత లేదని, రైతులకు సకాలంలో ఎరువులు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు.

జూన్ 8వ తేదీ నుండి జూన్ 16వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 95,506 మంది రైతులకు మొత్తం 4,77,501 ఎరువుల బస్తాలు విక్రయించినట్లు మంత్రి వెల్లడించారు. ఇందులో 3,56,916 యూరియా బస్తాలు, 1,20,585 డీఏపీ బస్తాలు రైతులకు అందించామని తెలిపారు. గ‌త వైసీపీ ప్ర‌భుత్వంలో ఎరువులను అక్ర‌మంగా అమ్ముకున్నారు, ఎరువులను రైతులకు అంద‌చేసేందుకు ప్ర‌త్యేక‌ యాప్ ను తీసుకొచ్చాం, రాష్ట్ర వ్యాప్తంగా స‌క్ర‌మంగా ఎరువుల‌ కొనుగోలు జ‌రుగున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు.

  • Related Posts

    వ్య‌వ‌సాయ రంగానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

    చెన్నై : త‌మిళ‌నాడు స‌ర్కార్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇందులో భాగంగా సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ అధ్యక్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వరి, చెరకు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై ప్రధానంగా చర్చించ‌నున్నారు. ఇవాళ జోసెఫ్…

    రైతుల‌కు రూ. 300 కోట్ల వార్షిక బ‌కాయిల చెల్లింపు

    అమ‌రావ‌తి : ఏపీ పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీఎం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సీఆర్డీఏ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలిపారు. పలు ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపార‌న్నారు. ఆలస్యం కారణంగా గృహ కొనుగోలుదారులు అదనపు ఆర్థిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *