డిప్యూటీ డైరెక్ట‌ర్ న‌ర‌హ‌రి ఆస్తులు రూ. 200 కోట్లు

Spread the love

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన అవినీతి నిరోధ‌క శాఖ

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులు ఒక్క‌రొక్క‌రుగా బ‌య‌ట ప‌డుతున్నారు. ఏసీబీ దాడుల నేప‌థ్యంలో క‌ళ్లు చెదిరేలా ఆభ‌ర‌ణాలు, నోట్ల క‌ట్ట‌లు , అక్ర‌మ ఆస్తులు తేట తెల్లం అవుతున్నాయి. తాజాగా స‌ర్వే ఆఫ్ ఇండియాలో డిప్యూటీ డైరెక్ట‌ర్ గా ఉన్న న‌ర‌హ‌రి రావు ఆస్తులు ఏకంగా రూ. 200 కోట్లకు పైగానే ఉంటాయ‌ని అంచ‌నా వేసింది ఏసీబీ. హైదరాబాద్‌లోని షాలిబండ కెనరా బ్యాంక్‌లో ఉన్న సుంకరి నరహరి రావు లాకర్ నుండి ఏసీబీ (ACB) రూ. 1.50 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకుంది. ఇంతకు ముందే రూ. 13.05 కోట్ల విలువైన (మార్కెట్ విలువ రూ. 200 కోట్లకు పైగా) ఆస్తులను గుర్తించారు.

అక్రమ ఆస్తుల కేసులో తెలంగాణ సర్వే, భూ రికార్డుల శాఖ (మల్టీ జోన్-II) డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి రావును తెలంగాణ ఏసీబీ ఇప్పటికే అరెస్టు చేసి, 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించింది. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. 1.24 ఎకరాల భూమి, 4 ఫ్లాట్లు, 2 భవనాలు… వీటి విలువ రూ. 13.05 కోట్లు (మార్కెట్ విలువ రూ. 200 కోట్లకు పైగా ఉండ‌డం విస్తు పోయేలా చేసింది.

  • Related Posts

    హామీల అమ‌లుపై సీఎంకు బీజేపీ చీఫ్ లేఖ

    Spread the love

    Spread the loveరాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడ‌టం లేదు హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ స‌ర్కార్ పై సీరియ‌స్ కామెంట్స్ చేశారు భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్యక్షుడు రామ‌చంద‌ర్ రావు. ఆదివారం ఆయ‌న సుదీర్ఘ లేఖ రాశారు ముఖ్య‌మంత్రి ఎ.…

    కార్య‌క‌ర్త‌ల‌పై మ‌ల్లికార్జున ఖ‌ర్గే క‌న్నెర్ర‌

    Spread the love

    Spread the loveడీకేకు మ‌ద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు బెంగళూరు : కర్ణాటక: ‘సంకల్ప సమావేశం’ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు “డీకే-డీకే” అని నినాదాలు చేయడంతో కాంగ్రెస్ (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ నినాదాలు చేస్తే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *