బీసీసీఐ యాజ‌మాన్యంపై గ‌వాస్క‌ర్ సీరియ‌స్

Spread the love


60 ఏళ్లుగా చూస్తున్నా ఇలా ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు

ముంబై : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ , ప్ర‌ముఖ క్రికెట్ కామెంటేట‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు ( బీసీసీఐ) యాజ‌మాన్యం అనుస‌రిస్తున్న విధానాల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ప్ర‌ధానంగా ఎంపిక చేస్తున్న ప‌ద్ద‌తిని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్ర‌త్యేకించి కొంద‌రి ఆట‌గాళ్ల‌కు ప్ర‌యారిటీ ఇవ్వ‌డం, మ‌రికొంద‌రిని కావాల‌ని ప‌క్క‌న పెట్ట‌డం దారుణ‌మ‌న్నారు.

నేను 60 ఏళ్లుగా క్రికెట్ చూస్తున్నాను, కానీ ఇంతలా ఎప్పుడూ కోపం రాలేదన్నారు సునీల్ మ‌నోహ‌ర్ గ‌వాస్క‌ర్. ఎంత దారుణమైన కెప్టెన్, వైస్ కెప్టెన్ వీళ్లు అంటూ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు . పానీయాలు అందించే పనిలో ఉన్న వైభవ్, అలాగే ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించినా జట్టుకు దూరంగా కూర్చోవాల్సి వస్తున్న రజత్ పరిస్థితి చూస్తుంటే బాధగా ఉందన్నారు. ఈ ఎంపికను ప్రజలు ఎప్పటికీ క్షమించరన్నారు స‌న్నీ. ఇదిలా ఉండ‌గా గవాస్కర్ చెప్పింది అక్షరాలా నిజం. వైభవ్, రజత్‌ల కంటే అయ్యర్, తిలక్‌లకు అవకాశం ఇవ్వడం భారత జట్టుకే నష్టం అని పేర్కొన్నారు.

  • Related Posts

    తెప్పపై విహరించిన శ్రీ సుందరరాజ స్వామి

    Spread the love

    Spread the loveఘ‌ణంగా కొన‌సాగుతున్న ప‌ద్మావ‌తి ఉత్స‌వాలు తిరుపతి : తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో వార్షిక తెప్పోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా పద్మ సరోవరంలో శ్రీ సుందర రాజ స్వామివారు తెప్పపై మూడు చుట్లు…

    ప్ర‌ధాని మొహ‌ర్రం పండుగ శుభాకాంక్ష‌లు

    Spread the love

    Spread the loveఇమామ్ హుస్సేన్ త్యాగం చిర‌స్మ‌ర‌ణీయం న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా శుక్ర‌వారం మొహ‌ర్రం పండుగ జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్బంగా జాతిని ఉద్దేశించి భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ముస్లిం సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. మొహర్రం సందర్భంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *